Realme P4s: బడ్జెట్, మిడ్రేంజ్ విభాగంలో రియల్మీ స్మార్ట్ఫోన్లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు తగ్గట్లుగా అద్భుతమైన ఫీచర్లతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే P సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారత్లో లాంచ్ చేయడానికి రియల్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే రియల్మీ P4s.
ప్రముఖ టిప్స్టర్ అందించిన లీక్స్ ప్రకారం.. ఈ కొత్త స్మార్ట్ఫోన్ ఆగస్టు చివరి నాటికి భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. మిడ్రేంజ్ విభాగంలో రానున్న ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: కొత్త లుక్లోకి Instagram.. వర్డ్మార్క్ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలుసా?
ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే అని చెప్పాలి. ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ రానున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. ఫోన్ ఎక్కువగా వాడేవారికి, గేమర్లకు ఇది ల్యాండ్మార్క్లా నిలుస్తుంది. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో.. ఛార్జింగ్ త్వరగా పూర్తయి సమయం బాగా ఆదా అవుతుంది.
ఇక డిస్ప్లే విషయానికొస్తే.. Realme P4sలో 144Hz రిఫ్రెష్ రేట్తో కూడిన 1.5K అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను అందించే అవకాశం ఉంది. ఇది గేమింగ్, వీడియా స్ట్రీమింగ్ అనుభవాన్ని మరింత స్మూత్గా మారుస్తుంది. అలాగే మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
ఫొటోగ్రఫీ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. రోజువారీ వాడకంలో మంచి ఫొటోలు తీయడానికి ఇది సరిపోతుంది. ఇక నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్కు ఐపీ69 (IP69) రేటింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బేస్ వేరియంట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్తో రానుండటంతో పనితీరు, బ్యాటరీ లైఫ్ను కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.
Also Read: స్మూత్ డిస్ప్లే, కిరాక్ లుక్.. ఆండ్రాయిడ్ 16తో Moto G Max 5G భారత్లోకి వచ్చేసింది!