Upcoming SUVs in India: భారత్లో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం టాటా నెక్సాన్, మారుతీ బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO లాంటి మోడళ్లు ఈ సెగ్మెంట్ లో సత్తా చాటుతున్నాయి. అయితే, రాబోయే రెండేళ్లలో ఈ మార్కెట్లో మరిన్ని కొత్త మోడళ్లు అడుగుపెట్టనున్నాయి. పెట్రోల్ తో పాటు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఆప్షన్లకు కూడా కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఒక కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని రెడీ చేస్తోంది. ఈ మోడల్ 2027లో వచ్చే అవకాశం ఉంది. క్రెటా ఎలక్ట్రిక్ కంటే తక్కువ ధరలో ఉండేలా దీనిని రూపొందించే అవకాశం కనిపిస్తోంది. టాటా పంచ్ EV, మహీంద్రా XUV 3XO EVలకు ఇది పోటీ ఇవ్వవచ్చని అంచనా. సింగిల్ ఛార్జ్ తో 400 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఉండొచ్చని సమాచారం.
టాటా నెక్సాన్ నుంచి న్యూ జెనరేషన్ మోడల్ రాబోతోంది. ‘గరుడ్’ అనే కోడ్ నేమ్ తో తయారు చేస్తోంది. 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త డిజైన్ తో పాటు ఇంటీరియర్, ఫీచర్లు, ఎలక్ట్రానిక్స్ లో మార్పులు ఉండొచ్చు. పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వంటి పవర్ ట్రెయిన్ ఎంపికలు కొనసాగే అవకాశం ఉంది.
కియా సెకెండ్ జెనరేషన్ సోనెట్ను కూడా తయారు చేస్తోంది. ఇప్పటికే టెస్ట్ వెహికల్స్ కనిపించాయి. కొత్త K1 ప్లాట్ఫామ్ను ఉపయోగించే అవకాశం ఉంది. కొత్త లైటింగ్, బంపర్లు, ఇంటీరియర్తో పాటు పెద్ద డిస్ ప్లేలు, కనెక్టెడ్ కార్ ఫీచర్లు, డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ లాంటి మార్పులు రావచ్చు. 2027లో కొత్త సోనెట్ విడుదలయ్యే అవకాశం ఉంది.
మహీంద్రా విజన్ S పేరుతో కొత్త మోడల్ రాబోతోంది. ఇది కొత్త NU_IQ ప్లాట్ఫామ్పై తయారయ్యే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్తో పాటు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లకు కూడా ఈ ఆర్కిటెక్చర్ ఉపయోగపడనుంది. 2027లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
వోక్స్ వ్యాగన్ టెరాను కూడా భారత మార్కెట్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. అయితే, భారత విడుదలపై వోక్స్ వ్యాగన్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
విన్ఫాస్ట్ VF 3 చిన్న ఎలక్ట్రిక్ వాహనంగా భారత్లోకి రావచ్చు. ఇందులో సుమారు 18.6 kWh బ్యాటరీ, 41 PS పవర్, 110 Nm టార్క్ ఉండే విదేశీ స్పెసిఫికేషన్ ఉంది. సుమారు 215 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుందని సమాచారం.
రెనాల్ట్ బ్రిడ్జర్ కూడా నాలుగు మీటర్ల లోపు SUVగా రాబోతోంది. 2027లో భారత్లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెట్రోల్ తో పాటు హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వెర్షన్లకు కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం.
హోండా కూడా సబ్ ఫోర్ మీటర్ SUV విభాగంలోకి తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. కొత్త మోడల్ 2028లో వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలివేట్ కంటే చిన్నదిగా ఉండనుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండొచ్చని సమాచారం. హైబ్రిడ్ టెక్నాలజీని కూడా హోండా పరిశీలించే అవకాశం ఉంది.
Read Also: 326 కి.మీ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. ఇండియన్ మార్కెట్ లోకి విన్ఫాస్ట్ VF5 ఎంట్రీ!