BJP Telangana: రాజకీయాల్లో చేతులు కలపడం సులువు మనసులు కలపడం కష్టం. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు అదే ప్రశ్న వినిపిస్తోంది. బండి సంజయ్ ఇంటికి ఈటల రాజేందర్ వెళ్లడం ఆ భేటీకి ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్ హాజరు కావడం పార్టీలో కొత్త సంకేతాలా? లేక కేవలం అధిష్ఠానం సూచన మేరకు జరిగిన మర్యాదపూర్వక సమావేశమా?
కలిసుంటే కలదు విజయం ఈ డైలాగ్ను బీజేపీ హైకమాండ్ తెలంగాణ కమలనాథులకు పదే పదే చెప్పినా వారి మధ్య వివాదాలు ఆగవు. ఈ పరిస్థితుల్లో అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని పార్టీ అధిష్ఠానం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో బండిసంజయ్ ఇంటికి ఎంపీలు ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
Also Read: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఫిర్యాదులు!
కానీ అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. పైకి నవ్వుతూ కెమెరాలకు ఫోజులిస్తున్న నేతలు, లోపల కూడా అంతే ఐక్యతతో సహకరించుకుంటారా? లేదా అన్నది ముందుముందు చూడాలి. అధిష్టానం ఆదేశాల మేరకు కలిసి పలకరించుకున్నప్పటికీ గతంలో నలిగిన పగలు, ప్రతికారాలు, ఆధిపత్య పోరు పూర్తిగా మరిచిపోవాలి. అధిష్ఠానం సమావేశాలు పెట్టగలదు. నాయకులను ఒకే టేబుల్ దగ్గరకు తీసుకురాగలదు. కానీ నిజమైన ఐక్యత మాత్రం ఆ నాయకుల మనసుల్లోనే పుడుతుంది. తెలంగాణ బీజేపీలో కనిపిస్తున్న ఈ కలయిక ఫొటోలకే పరిమితమవుతుందా? లేక భవిష్యత్ రాజకీయాలకు కొత్త బాట వేస్తుందా?
Also Raed: పార్లమెంట్లో మళ్లీ మోదలైన బిల్లుల యుద్దం.. మోదీ సర్కార్ ప్లాన్ గట్టెక్కేనా..!