E-Paper
Advertisement

ఏపీలో ముదిరిన భద్రతా రాజకీయం.. అమిత్ షా వద్ద వైఎస్ జగన్ సెక్యూరిటీ వివాదం!

ఏపీలో ముదిరిన భద్రతా రాజకీయం.. అమిత్ షా వద్ద వైఎస్ జగన్ సెక్యూరిటీ వివాదం!
Advertisement

Jagan Security: ఏపీ రాజకీయాల్లో సెక్యూరిటీ సెగ రాజకీయాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తోంది. మాజీ సీఎం జగన్‌ భద్రతపై ఇప్పుడు ఢిల్లీ పీఠం దాకా రగడ ముదిరింది. జిల్లాల పర్యటనల్లో జగన్‌కు వరుసగా భద్రతా వైఫల్యాలు ఎదురవుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ పర్యటనల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, కావాలనే సెక్యూరిటీని తగ్గించారంటూ ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది.

వైసీపీ ఎంపీల బృందం..

స్థానికంగా పోలీసులకు, డీజీపీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వైసీపీ ఎంపీల బృందం నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి లేఖ అందించడం సంచలనంగా మారింది. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో కాక రేపుతోంది. ఇదంతా వైఎస్సార్‌సీపీ ఆడుతున్న పక్కా పొలిటికల్ డ్రామా అని టీడీపీ విమర్శిస్తోంది.

Advertisement

Also Read: అసలు యూపీఐ అంటే ఏంటి? ఎలా పనిచేస్తోంది? ఉచిత సేవలకు అయ్యే ఖర్చెంత?

ఒకవైపు భద్రతా వైఫల్యం..

ప్రజాదరణ తగ్గుతోందనే భయంతో, మైలేజ్ కోసమే కావాలని జనాన్ని తోసి గొడవలు సృష్టిస్తోందని అధికార పక్షం ఆరోపిస్తోంది. భద్రతను నెపంగా చూపి సానుభూతి పొందేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోందనేది టీడీపీ వర్గాల వాదన. ఒకవైపు భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షం పోరాటం.. మరోవైపు పబ్లిసిటీ స్టంట్ అంటూ అధికార పక్షం తిరుగుబాణంతో ఏపీలో సెక్యూరిటీ రాజకీయం తీవ్రస్థాయికి చేరింది. ఈ సెక్యూరిటీ వార్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ వరకు వెళ్లడంతో.. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతాయో.?

Advertisement

Also Read: విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. గన్నవరం మెట్రో లైన్‌పై కీలక ముందడుగు!

Tags

Related News

ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ ఛార్జీలపై నిపుణులు చెబుతున్న నిజాలివే!

హామీలు నీ వ‌ల్ల కాదు.. కేసీఆర్ ఇచ్చిన‌వి ఇస్తే చాలు.. ఈట‌ల మార్క్ పొలిటిక‌ల్ స్ట్రైక్‌!

గ్రేటర్ హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. లక్షలాది ఓట్లకు కత్తెర పడటం ఖాయమా..?

పేదలకా లేక అపర కుబేరులకా.. రైతు భరోసాపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

విజయవాడలో బోండా ఉమ హల్‌చల్.. మల్లాది విష్ణు దీక్ష వద్ద ఊహించని సీన్!

ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్‌- బీజేపీకి రియాక్ష‌న్‌.. పొత్తు వ‌ద్దే వ‌ద్ద‌ని నిర్ణ‌యం..!

అర్హుల‌కు రైతుబంధు సంక్షేమం.. అంద‌రికీ రైతుబంధు ఓటుబ్యాంకు..ఇద్ద‌రూ చేసింది రెండోదే..!

Big Stories

Advertisement
×