HAE Society: హైదరాబాద్ హఫీజ్పేట H.A.E సొసైటీ స్థలం కబ్జాపై వివాదం కొనసాగుతోంది. 25 ఏళ్ల నుంచి సొసైటీ అధీనంలో ఉన్న ల్యాండ్పై కబ్జాదారుల కన్ను పడింది. కొందరు వ్యక్తులు తమ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సొసైటీ సభ్యులు ఆందోళన బాటపట్టారు. న్యాయం పోరాటం చేస్తున్నారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీ కి చెందిన 8 ఎకరాల భూమిని కబ్జా బారి నుంచి రక్షించుకునేందుకు వారం రోజులుగా అక్కడే ఉంటున్నారు రిటైర్డ్ ఉద్యోగులు.
Also Read: మేడ్చల్ పీహెచ్సీలో దారుణం.. ప్రసవం కోసం వస్తే గాంధీ ఆస్పత్రికి రిఫర్..!
ఇవాళకూడా పంద్రాగస్టు వేడుకను అదే స్థలంలో నిర్వహించుకన్నారు. హైకోర్టు తీర్పు వారికి అనుకూలంగా ఉన్నా సరే, కొందరు ఆ స్థలంలో షాప్లు, షెడ్లు వేస్తూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బిగ్ టీవీ వరుస కథనాలతో అక్రమార్కుల వెన్నులోవణుకు పుట్టింది. కబ్జారాయులు కాస్త వెనక్కి తగ్గారు. కానీ వాళ్లు మళ్లీ ఆక్రమణకు వస్తారని ఆందోళన చెందతున్నారు. సొసైటీ సభ్యులు. రూపాయి రూపాయి కూడబెట్టి తాము ఈ స్థలాలను కొన్నామని, తాము న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
Also Read: పంద్రాగస్టు వేళ రచ్చ లేపిన మల్లారెడ్డి.. వైరల్ అవుతున్న మాజీ మంత్రి స్పీచ్!