Jaipur School: జైపూర్లో ప్రభుత్వ పాఠశాల విజిట్ కు వెళ్లిన సీజేపీ నేత ఆశుతోష్ రాంకా, కార్యకర్తలపై దాడి జరగడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయ్. వాహనాల ధ్వంసం, రాళ్ల దాడి, కార్యకర్తలకు గాయాలయ్యాయని సీజేపీ ఆరోపిస్తోంది. అటాక్ వెనుక బీజేపీ కార్యకర్తలున్నారన్నది వారి వాదన. అయితే బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ, సీజేపీ వెనుక కాంగ్రెస్ ఉందంటూ ఎదురుదాడి చేస్తోంది.
Also Read: రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
మరి ఇది కేవలం ఒక దాడి ఘటనగానే చూడాలా? లేక సీజేపీ పొలిటికల్ జర్నీలో మొదటి పెద్ద గ్రౌండ్ టెస్ట్గా భావించాలా? స్కూళ్ల సమస్యలపై జనంలోకి వెళ్తున్నప్పుడు స్థానిక వ్యతిరేకతను డీల్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలిసి వచ్చిందా? ప్రజల్లో నమ్మకం పెంచుకునే వ్యూహం సీజేపీకి అవసరం అని తాజా ఘటన రుజువు చేస్తోంది. గ్రౌండ్లో ఎదురయ్యే వ్యతిరేకతను అవకాశంగా మలుచుకుని సీజేపీ నిలబడగలగడమే అసలైన సవాల్.