E-Paper
Advertisement

రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
Advertisement

Raidurgam Land: రాయదుర్గం పాన్​ మక్తా భూముల వేలం ప్రక్రియలో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఏ విషయాన్నయినా తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. రాయదుర్గం పాన్​ మక్తాలోని రెండు సర్వే నెంబర్లలో ఉన్న 11 ఎకరాల భూమిని అమ్మేందుకు టీజీఐఐసీ వేలం జరపాలని నిశ్చయించింది. అయితే దీనిపై జువ్వాడి ప్రణయ సింహారావు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్​ దాఖలు చేశారు.

దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్​ తరపు న్యాయవాది నీరజ్​ కిషన్​ కౌల్​ వాదనలు వినిపిస్తూ గతంలో కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు రక్షించమని చెప్పిన భూములనే ఇప్పుడు వేలం వేస్తున్నారని తెలిపారు.

Advertisement

Also Read: కొడుకుని కాపాడబోయి తండ్రి.. ఇద్దరూ పోయారని భార్య.. ఫ్యామిలీని బలితీసుకున్న స్మార్ట్‌ఫోన్!

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ.. పిటిషనర్​ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కంచె గచ్చిబౌలి భూములకు ఇప్పుడు వేలం వేయటానికి నోటిఫికేషన్​ ఇచ్చిన భూమికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ భూములు కంచె గచ్చిబౌలి భూములకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు భూముల వేలానికి సంబంధించి టీజీఐఐసీ ఇచ్చిన నోటిఫికేషన్​ లో ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణకు నిరాకరించింది.

Advertisement

Also Read: టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

Tags

Related News

‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చలు!

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ 10 మంది ఎమ్మెల్యేల జాతకం తేలేది అప్పుడే!

మంచిర్యాల కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మధ్య పెరుగుతున్న దూరం!

Big Stories

Advertisement
×