Raidurgam Land: రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలం ప్రక్రియలో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఏ విషయాన్నయినా తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. రాయదుర్గం పాన్ మక్తాలోని రెండు సర్వే నెంబర్లలో ఉన్న 11 ఎకరాల భూమిని అమ్మేందుకు టీజీఐఐసీ వేలం జరపాలని నిశ్చయించింది. అయితే దీనిపై జువ్వాడి ప్రణయ సింహారావు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తూ గతంలో కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు రక్షించమని చెప్పిన భూములనే ఇప్పుడు వేలం వేస్తున్నారని తెలిపారు.
Also Read: కొడుకుని కాపాడబోయి తండ్రి.. ఇద్దరూ పోయారని భార్య.. ఫ్యామిలీని బలితీసుకున్న స్మార్ట్ఫోన్!
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వీ.. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కంచె గచ్చిబౌలి భూములకు ఇప్పుడు వేలం వేయటానికి నోటిఫికేషన్ ఇచ్చిన భూమికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ భూములు కంచె గచ్చిబౌలి భూములకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు భూముల వేలానికి సంబంధించి టీజీఐఐసీ ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణకు నిరాకరించింది.
Also Read: టాలీవుడ్కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ