Viveka Murder: వివేకా హత్య వెనుక ఆర్థిక లావాదేవీల కోణాన్ని ఈడీ ఫోకస్ చేయడంతో.. కేసులో మరోసారి మనీ ట్రయల్ కీలకంగా మారింది. సీబీఐ చార్జ్షీట్లు, అనుబంధ చార్జ్షీట్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. మరి హత్యకు సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నిందితులకు ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 కోట్ల మూలం ఏంటి? ఆ డబ్బు ఎవరి ద్వారా, ఏ మార్గంలో వెళ్లిందన్నది బయటపడితే.. ఇన్నాళ్లుగా ఉన్న చిక్కుముడికి కీలక ఆధారం దొరుకుతుందంటున్నారు.
Also Read: తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!
ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తయిందన్న వ్యవహారంతో ఈడీ రంగంలోకి రావడం మరో చర్చకు తెరతీసింది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీల దర్యాప్తేనా? లేక హత్య కేసులోని కీలక లింకులను కూడా బయటకు తీస్తుందా? అన్నది కీ టాపిక్ గా మారింది. మనీ ట్రయల్ తేలితేనే వివేకా కేసు మిస్టరీకి పూర్తి క్లారిటీ వస్తుందా? అన్నది చూడాలి.