NALSAR Students: హైదరాబాద్ నల్సార్ లా విద్యార్థుల నిరసన ఇప్పుడు క్యాంపస్ గోడలు దాటి రాజకీయ రంగు పులుముకుంటోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకోబోమంటూ విద్యార్థులు లేఖ రాయడం, ఆపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడం న్యాయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నల్సార్ లా కాలేజ్ విద్యార్థులను లాయర్లుగా ఎన్రోల్ చేయొద్దంటూ ఆదేశాలు జారీచేసింది. కానీ, వీటిని కొద్ది గంటల్లోనే వెనక్కి తీసుకుంది బీసీఐ.
Also Read: నిబంధనలా లేక రాజకీయ కుట్రలా.. కర్నూలు జైలు అధికారులపై జగన్ ఫైర్!
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్కు సంబంధించిన సుప్రీంకోర్టు విచారణలో సీజేఐ చేసిన కొన్ని వ్యాఖ్యలే విద్యార్థుల నిరసనకు ప్రధాన కారణం. ఈ నిరసన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఎవరు సమన్వయం చేశారు? అనే దానిపై సమగ్ర వివరాలను అందజేయాలని బీసీఐ కోరింది. ఆగస్టు 19లోపు రిపోర్ట్ ఇవ్వాలని నల్సార్ లా యూనివర్సిటీ వీసీని ఆదేశించింది. న్యాయాన్ని చదువుతున్న విద్యార్థులు… న్యాయాన్నే ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలు ఇది విద్యార్థుల మనసులోంచి పుట్టిన న్యాయపోరాటమా? లేక న్యాయ విద్యార్థుల నిరసనకు రాజకీయ రంగు అద్దారా?
Also Read: కాంగ్రెస్కు రాజగోపాల్ రెడ్డి గుడ్బై చెప్తారా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!