Jagan Jail: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసేందుకు కర్నూలు జైలును వెళ్లిన జగన్కు ములాఖత్ సమయంలో అధికారులు ఫొటోలు, వీడియోలు తీశారు. దీనిపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు. కానీ జైలు అధికారులు మాత్రం మరో వాదన వినిపించారు.
ఇది వ్యక్తిగత నిర్ణయం కాదని. ఈ-ప్రిజన్స్ సాఫ్ట్వేర్లో ఉన్న నిబంధనలను పాటించామని జైలు సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. విరూపాక్షి, ఆయన సోదరుడు శ్రీరాములుతో జగన్ వేర్వేరుగా ములాఖత్ కావడంతో నిబంధనల ప్రకారం ఫొటోలు నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు.
Also read: స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!
జైలు నిబంధనలు, టెక్నికల్ రూల్స్ పరంగా అధికారులు చెప్పేది సాంకేతికంగా సరైనదే కావచ్చు. కానీ, ఒక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం విషయంలో కనీస ప్రొటోకాల్, గౌరవం పాటించడంలో జరిగే లోపాలు ఇలాంటి వివాదాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ప్రతి అరెస్ట్, ప్రతీ ములాఖత్, ప్రతి ఫోటో వెనుక రాజకీయ అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఇలాంటి వాతావరణం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆరోగ్యకరమైన పరిణామం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.