AP Exam Politics: ఏపీలో పరీక్షలు రాజకీయ అస్త్రాలుగా మారాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుంటే.. గతంలో గ్రూప్-1 మూల్యాంకనంలో మోసాలు జరిగాయని టీడీపీ అంటోంది. డీఎస్సీ అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీకి, సిట్ నివేదిక రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన రికార్డులను పరిశీలిస్తే ఏకంగా 718 చోట్ల దిద్దుబాట్లు, ఓవర్రైటింగ్లు జరగడం, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుల్లో ఇది నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. డీఎస్సీ అంశంపై వైసీపీ చేస్తున్న రాజకీయ పోరును డైవర్ట్ చేయడానికే కూటమి ప్రభుత్వం ఈ గ్రూప్-1 అస్త్రాన్ని ప్రయోగించిందా లేక దర్యాప్తులో నిజాలు వెలుగు చూశాయా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: వ్యక్తిగత దూషణలు చేయవద్దు.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!
ఇలా ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటూ, సాక్ష్యాల పేరిట సాగిస్తున్న ఈ రాజకీయ క్రీడలో నిరుద్యోగుల కన్నీళ్లు ఎవరికీ కనిపించడం లేదా? అక్రమాలు ఎవరి కాలంలో జరిగినా, అది నేరమే కానీ, ఆ నేరాన్ని అడ్టుపెట్టుకుని సాగించే రాజకీయ చదరంగంలో యువత భవిష్యత్తును బలిపెట్టడం క్షమించరాని నేరం.
Also read: కాంగ్రెస్కు రాజగోపాల్ రెడ్డి గుడ్బై చెప్తారా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!