Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఓవైపు రాహుల్ గాంధీ వెంటే ఉంటానని, పార్టీని వీడేది లేదని చెబుతూనే, మరోవైపు ప్రభుత్వ తీరుపై, పదవుల కేటాయింపులపై ఆయన చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఉద్యమనేతలు, సీనియర్లను విస్మరించి, వలసొచ్చిన నేతలకే పార్టీలో పట్టం కడుతున్నారన్న ఆయన ఆరోపణలో సొంత గూటిలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం కనిపిస్తోంది. ముఖ్యంగా, తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తే ఈ విమర్శలకు ఆజ్యం పోస్తోందన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇక తమిళనాడు తరహాలో కొత్త రాజకీయ పరిణామాలు తీసుకువస్తా అంటూ రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. సొంత ప్రభుత్వంలోనే ప్రజాధనం దుర్వినియోగం అవుతోందంటూ ఎమ్మెల్యే హోదాలో ఆయన చేసిన కామెంట్స్ విపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి.
Also Read: మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఇటు పార్టీ లైన్ దాటే వారిపై హైకమాండ్ కూడా సీరియస్గా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఓవైపు బీజేపీ నేతలు అంతర్గత వివాదాలను పక్కనపెట్టి కలిసిపోతుంటే.. ఇప్పుడు రాజగోపాల్రెడ్డి వినిపించే అసంతృప్తి స్వరాలు కాంగ్రెస్కు తలనొప్పిగా మారాయి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందా? ఎప్పుడూ ఉండేదే కదా అని లైట్ తీసుకుంటుందా?
Also read: మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ ఫైర్.. కాంగ్రెస్కు గండం పొంచి ఉందా?