BigTV English

KKR: ఐపీఎల్ 2025 కంటే ముందే KKR నుంచి ముగ్గురు ఔట్.. ఇక గెలవడం కష్టమే ?

KKR: ఐపీఎల్ 2025 కంటే ముందే  KKR నుంచి ముగ్గురు ఔట్.. ఇక గెలవడం కష్టమే ?

KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Ipl 2025) కంటే ముందు… గత టోర్నమెంటులో ఛాంపియన్గా నిలిచిన కేకేఆర్ జట్టుకు… ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( Ipl 2025)  ప్రారంభాని కంటే ముందు కేకేఆర్ జట్టులో ముగ్గురికి గాయాలు అయ్యాయి. రాబోయే ఐపీఎల్ సీజన్ కి ముందు ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీ ఓనర్లను కంగారు పెడుతున్నాయి. కొంతమంది ఆటగాళ్లు తమ ప్రదర్శనను మెరుగుపరచుకొని ఆశలు పెంచుతున్నారు.


ALSO READ: Team India: సూర్యకు బిగ్ షాక్… టీమిండియా కొత్త కెప్టెన్ గా తెలుగు కుర్రాడు ?

మరికొంతమంది గాయాల కారణంగా టోర్నీ ( Ipl 2025)  నుంచి నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయి. గత సీజన్ ఛాంపియన్ కోల్కత్తా నైట్ రైడర్స్ కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. జట్టులోని ముగ్గురు స్టార్ ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. ఆటగాళ్లకు అయిన గాయాలు జట్టును కంగారు పెడుతున్నాయి. ఐపీఎల్ కి ముందు ఈ ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్ తో లేకపోయినట్లయితే కేకేఆర్ భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది. వెంకటేష్ అయ్యర్ 2021 నుంచి కేకేఆర్  ( KKR ) తో జతకట్టాడు. గత వేలంలో కేకేఆర్ యాజమాన్యం అతనికి 23.75 కోట్ల భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేసింది.


 

లీగ్ చరిత్రలో అతను నాలుగవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ ( Venkatesh Iyer) కేకేఆర్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఎందుకయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ రంజీ ట్రోఫీ మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ గాయపడడం జట్టుకు మరింత కష్టాలను తీసుకువచ్చింది. వెంకటేష్ అయ్యర్ ( Venkatesh Iyer) గాయం తర్వాత బ్యాటింగ్ చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ఫిట్నెస్ సరిగ్గా లేదని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో కేకేఆర్ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఇక కేకేఆర్ రింకు సింగ్ ను ( Rinku Singh ) మ్యాచ్ విన్నర్ గా భావిస్తూ ఉంటుంది. కానీ రింకు సింగ్ ( Rinku Singh ) ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టీ20 కి ముందు గాయపడ్డాడు.

ALSO READ: Travis Head: ఓపెనర్ గా వచ్చి రెచ్చిపోయిన హెడ్….టెస్టులు కూడా ఇక చూడాల్సిందే !

దీంతో సిరీస్ లో రెండు మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతని గాయంపై తుది నివేదిక వచ్చేవరకు కేకేఆర్ జట్టుకు ఈ టెన్షన్ తప్పేలా లేదు. వచ్చే సీజన్ కోసం కేకేఆర్ రిటైన్ చేసిన తొలి ఆటగాడు రింకు సింగ్ కావడం విశేషం. దక్షిణాఫ్రికా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ లో గాయపడ్డాడు. ఈ టోర్నీతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ కష్టాలు మరింత పెరిగాయి. ఛాంపియన్ ట్రోఫీ ( Champion Trophy )  ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఎందుకంటే ఎన్రిచ్ ఎప్పుడు ఫిట్ గా ఉంటారు అనేదానిపై క్లారిటీ లేదు. లీగ్ ప్రారంభం నాటికి అతను ఫిట్ గా లేకపోతే అది కేకేఆర్ బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే అవుతుంది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×