E-Paper
Advertisement

UPI Faster: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక యుపిఐ లావాదేవీలు సూపర్ ఫాస్ట్..

UPI Faster: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక యుపిఐ లావాదేవీలు సూపర్ ఫాస్ట్..
Advertisement

UPI Faster| భారతీయుల రోజువారీ జీవితాన్ని యుపిఐ టెక్నాలజీ ఒక్కసారిగా మార్చేసింది.లావదేవీల కోసం నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చిల్లర సమస్య అసలే ఉండదు. అంతా సులభతరం చేసింది ఈ టెక్నాలజీ. అందుకే యుపిఐని వినియోగించే వారి సంఖ్య దేశంలో రోజురోజుకీ పెరగిపోతోంది. ఈ నేపథ్యంలో యుపిఐని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త నిబంధనలు తెస్తుంది. తాజాగా, NPCI ఒక కీలక ప్రకటన చేసింది. UPI సేవలు మరింత వేగవంతం, సమర్థవంతం కావాలని ఆదేశించింది. ఈ మార్పులను జూన్ 16 నాటికి అమలు చేయాలని NPCI.. అన్ని సభ్య సంస్థలకు సూచించింది.

NPCI జారీ చేసిన సర్కులర్ ప్రకారం.. యుపిఐలో తరచుగా ఉపయోగించే కొన్ని APIల (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) స్పందన సమయాన్ని తగ్గించారు. ఉదాహరణకు.. లావాదేవీ స్థితిని చెక్ చేసే (Check Transaction Status), లావాదేవీ రద్దు చేసే (Transaction Reversal) APIల స్పందన సమయం గతంలో 30 సెకన్లు ఉండగా.. ఇప్పుడు 10 సెకన్లకు తగ్గించారు. అలాగే, చిరునామా ధ్రువీకరణ (Validate Address) API స్పందన సమయం.. 15 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గింది. ఈ APIలు.. చెల్లింపు (Pay), సేకరణ (Collect) లావాదేవీలలో ఉపయోగపడతాయి.

Advertisement

ఈ మార్పులు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం.. వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల (PSPs)తో పాటు చెల్లింపు చేసే బ్యాంకులు (Remitter Banks), చెల్లింపు స్వీకరించే బ్యాంకుల (Beneficiary Banks)కు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ కొత్త స్పందన సమయాలతో UPI వినియోగదారులకు లావాదేవీలు మరింత సులభంగా, వేగంగా జరుగుతాయి. గతంలో విఫలమైన లావాదేవీలను రద్దు చేయడానికి లేదా చెల్లింపు స్థితిని తెలుసుకోవడానికి 30 సెకన్లు పట్టేది, ఇప్పుడు అది కేవలం 10 సెకన్లలో పూర్తవుతుంది.

ఈ మార్పుల వల్ల వినియోగదారుల అనుభవం మెరుగుపడుతుందని NPCI తెలిపింది. “సభ్య సంస్థలు తమ సిస్టమ్‌లలో అవసరమైన మార్పులు చేయాలి. భాగస్వాములు లేదా వ్యాపారుల వద్ద ఏవైనా సాంకేతిక మార్పులు అవసరమైతే, వాటిని కూడా సమన్వయం చేయాలి” అని NPCI సర్కులర్‌లో పేర్కొంది. ఈ మార్పులు UPI సేవలను మరింత నమ్మదగినవిగా, వేగవంతంగా చేస్తాయి.

Advertisement

ఈ కొత్త నిబంధనలతో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్‌లను ఉపయోగించే కోట్లాది మంది వినియోగదారులకు లావాదేవీలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. ఉదాహరణకు.. ఒక దుకాణంలో చెల్లింపు చేస్తున్నప్పుడు లేదా స్నేహితులకు డబ్బు పంపుతున్నప్పుడు, లావాదేవీ విజయవంతమైందా? లేదా? అని తెలుసుకోవడానికి ఇకపై ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ మార్పులు డిజిటల్ పేమెంట్ల విశ్వసనీయతను మరింత పెంచుతాయి.

Also Read: ఈ యాప్‌లను వెంటనే ఫోన్ నుంచి తొలగించండి.. గూగుల్ ప్లే స్టోర్ హెచ్చరిక

జూన్ 16 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనలు భారతదేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళతాయి. NPCI ఈ చర్యలతో భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది.

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×