Crime News: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామంలో మంగళవారం ఉదయం లారీ, బొలేరో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు చనిపోయారు. ఈ ఘటన గుంటూరు- కర్నూలు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళా కూలీలను నరసరావుపేట వద్ద వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీ కొట్టింది.
Also Read: కల్తీ కల్లు ప్రభావం.. 15 మంది మృతి, ఎక్కడ?
ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ బొలెరో వాహనం డ్రైవర్ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగ ఉండడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.