E-Paper
Advertisement

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Hyderabad News: హైదరాబాద్‌లోని పట్టపగలు నడిరోడ్డుపై యువకులు రెచ్చిపోయారు. కారులో వెళ్తున్న యువకులు.. బైక్‌పై వెళ్తున్నవారిని క్రికెట్ బ్యాట్‌తో చావబాదారు. తమను రక్షించాలని వేడుకున్నా, ఏ ఒక్కరూ ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లోని బండ్లగూడ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తూ అనుకోకుండా కారుని ఢీకొట్టింది ఓ బైక్. ఆ తర్వాత బైక్ కొద్దిదూరం వెళ్లింది. ఈలోగా కారు.. ఆ బైక్‌ని చేంజ్ చేసి ఆపింది. తమ కారుని ఢీ కొడతారా అంటూ బైక్ రైడర్‌పై విరుచుకుపడ్డారు కారులోని కొందరు యువకులు.

ఈ క్రమంలో కారులోని యువకులు-బైక్ రైడర్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  కర్రలు-క్రికెట్‌ బ్యాట్లతో వారిపై విరుచుకుపడ్డారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న స్థానికులు చేరుకుని వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పట్టరాని కోపంతో క్రికెట్ బ్యాట్ తీసుకుని బైక్‌పైనున్న యువకులను చావబాదారు. దాడి జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ ద్వారా ఆ సన్నివేశాలను బంధించాడు.

ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.దీనిపై నిరసన వ్యక్తమైంది.కారుపై ఏరియా సభ సభ్యుడు అనే స్టిక్కర్ ఉంది. దాడి యవ్వారం వైరల్ కావడంతో పోలీసుల దృష్టిలో పడింది. బండ్లగూడ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బైక్‌ వ్యక్తులపై దాడి చేసినవారిని గుర్తించేందుకు స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించారు.

ALSO READ: దారుణం.. మూడేళ్ల కూతుర్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

దాడికి పాల్పడినవారెవరు? స్థానికులా? బయట నుంచి వ్యక్తులా? కారు నెంబరు మాత్రం తెలంగాణ పేరు మీద రిజిస్ట్రేషన అయ్యింది. ఆ వాహనం ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

 

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×