Mega DSC: మెగా డీఎస్పీ పై ఏపీలో ఇప్పటికే రాజకీయం రగులుతోంది. హండ్రెడ్ పర్సెంట్ పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. మరోవైపు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు, పేపర్ లీక్లు జరిగాయని, మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళను చేస్తోంది.
రాజకీయాల కోసం రాద్దాంతం చేయోద్దు.. అభ్యర్థుల్లోఅలజడిరేపోద్దు.. ఎవరికి ఏ అభ్యంతరాలున్నా మళ్లీ మళ్లీవివరించాడానికి తాము సిద్దమని విద్యాశాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ఇలాంటి టైమ్లో నలుగురు టీచర్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి.. ఫిర్యాదు చేయడం చర్చగా మారింది. కంప్లేంట్ చేయడంలో తప్పు లేదుకానీ వైసీపీ నేతల వెంట వెళ్లి కేంద్రానికి ఫిర్యాదవ్వడం ఇప్పుడు రచ్చయింది.
Also Read: ప్రశాంతంగా ఉందని ఈ ఊరికి వచ్చాడు… లోపల గుట్టు తెలిస్తే షాకే భయ్యా
ప్రభుత్వ కొలువు చేస్తూ రాజకీయాలేంటి? పార్టీలతో లింకేంటని ఆ నలుగురు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేసింది ఏపీ విద్యాశాఖ. నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టే శాఖపరంగా చర్యలుతీసుకున్నామన్నారు అధికారులు. ప్రభుత్వ ఉద్యోగులై వుండి పార్టీలతో అంటకాగవచ్చా? ఈ పాయింట్ బిగ్ డిబెట్గా మారిందిప్పుడు.
Also Read: తెలంగాణ పల్లె ప్రజలకు ఊహించని శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి భారీ గిప్ట్!