BigTV English

Bank Official Fraud: కస్టమర్లను మోసం చేసిన బ్యాంకు అధికారి.. కోట్లు దోచుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు

Bank Official Fraud: కస్టమర్లను మోసం చేసిన బ్యాంకు అధికారి.. కోట్లు దోచుకొని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు

Bank Official Fraud| బ్యాంకులో డబ్బు సురక్షితంగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, రాజస్థాన్‌లోని కోటాలో ఓ బ్యాంకు అధికారిణి 41 మంది ఖాతాదారుల నుంచి రూ. 4.58 కోట్లు మోసం చేసింది. ఆమె పేరు సాక్షి గుప్తా. ఆమె ఐసీఐసీఐ బ్యాంకులో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేసేది. స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టి ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఆశతో ఈ మోసం చేసింది.


2020 నుంచి 2023 వరకు రెండేళ్ల పాటు సాక్షి ఈ మోసాన్ని రహస్యంగా కొనసాగించింది. బ్యాంకులో ఎవరికీ ఈ విషయం తెలియలేదు. ఆమె ‘యూజర్ ఎఫ్‌డీ’ లింక్‌ని ఉపయోగించి, 110 ఖాతాల నుంచి డబ్బును గుట్టుచప్పుడు కాకుండా కాజేసింది. ఈ డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టింది. కానీ, మార్కెట్‌లో భారీ నష్టాలు రావడంతో ఆ డబ్బును తిరిగి ఖాతాల్లో వేయలేకపోయింది.

ఈ మోసం ఒక ఖాతాదారుడు తన ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి తెలుసుకోవడానికి బ్యాంకులో వచ్చినప్పుడు బయటపడింది. ఫిబ్రవరి 18న బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాక్షి గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తన సోదరి వివాహ వేడుకలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమెను కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కోసం జైలుకు తరలించారు.


పక్కా ప్లానింగ్ తో మోసం
సాక్షి తన మోసాన్ని దాచడానికి ఖాతాదారుల ఫోన్ నంబర్లను మార్చేసింది. ఆమె తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఖాతాలకు లింక్ చేసి, లావాదేవీల సమాచారం ఖాతాదారులకు తెలియకుండా చేసింది. అంతేకాదు, ఓటీపీలు తన సిస్టమ్‌కు వచ్చేలా ఒక వ్యవస్థను కూడా రూపొందించింది. దీంతో ఖాతాదారులకు ఎలాంటి సమాచారం అందలేదు.

ఐసీఐసీఐ బ్యాంకు ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, బ్యాంకు వర్గాల సమాచారం ప్రకారం.. నష్టపోయిన ఖాతాదారులకు బ్యాంకు పరిహారం చెల్లిస్తుందని సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన ఓ ఖాతాదారుడు మహావీర్ ప్రసాద్, తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి బ్యాంకుకు వచ్చాడు. “సాక్షి గుప్తా రూ. 4 కోట్లు మోసం చేసిందని విన్నాను. నా డబ్బు సురక్షితంగా ఉందో లేదో చూడటానికి వచ్చాను,” అని అన్నాడు. “మా డబ్బును ఎక్కడ పెట్టాలి? ఇంట్లో ఉంచలేం, బ్యాంకులో కూడా సురక్షితం కాదు. ఇప్పుడు మేము ఏం చేయాలి?” అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Related News

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Train Accident: రైలు ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి

Husband Kills Wife: గాఢ నిద్రలో భార్య.. సైలెంటుగా గొంతుకోసి పరారైన భర్త.. అసలు ఏమైంది

Food Delivery Boy: ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై ఘోరంగా దాడి

Guntur Bus Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 25 మంది

Big Stories

×