BigTV English
Advertisement

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మృతి

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మృతి

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో సాయుధ బలగాలు భారీ ఎన్ కౌంటర్ చేపట్టాయి. ఈ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.


ఇటీవల కాలంలో ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్స్ జరుగుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ దక్షిణ బస్టర్ ప్రాంత అడవుల్లో DRG, కోబ్రా, CRPF బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల్లో జరుగుతున్న ఈ ఆపరేషన్ లో ఈ మూడు జిల్లాలకు చెందిన భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకూ 11 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. దీంతో ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఈ ఎన్ కౌంటర్ ను బస్తర్ ఐజి సుందర్ రాజ్ ధ్రువీకరించారు. ఉదయం 9 గంటలకు మెుదలైన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఘటనా స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ : ఆ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం సై!


Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×