E-Paper
Advertisement

Kurnool News: కిరాతక తండ్రి.. 8 నెలల పసిపాపను డ్రమ్ములో ముంచి.. భార్యను దారుణంగా కొట్టి..!

Kurnool News: కిరాతక తండ్రి.. 8 నెలల పసిపాపను డ్రమ్ములో ముంచి.. భార్యను దారుణంగా కొట్టి..!
Advertisement

Kurnool News: కర్నూలులో దారుణ విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దేవనకొండలో ఓ కిరాతక తండ్రి 8 నెలల చిన్నారిని దారుణంగా చంపాడు. భార్యపై అనుమానంతో ఎనిమిది నెలల పసి పాపను తండ్రి నరేష్ నీటి డ్రమ్ములో ముంచి కిరాతకంగా హత్య చేశాడు. అంతే కాకుండా అడ్డు వచ్చిన భార్య శ్రావణిని తీవ్రంగా కొట్టేందుకు ప్రయత్నంచాడు. భర్త నరేష్ దాడిలో శ్రావణికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొన ఊపిరితో ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Weather News: మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఈ రెండ్రోజులు జాగ్రత్త.. ఎల్లో అలర్ట్ జిల్లాలివే

Advertisement

నరేష్ గతంలో కూడా నేరాలకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. తన మొదటి భార్యను చంపేసి  జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలిపారు. జైలు నుంచి విడుదల అయ్యాక మర్డర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.  నరేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతోనే పసి పాపను చంపి.. భార్యను కూడా చంపబోయాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

ALSO READ: Constable Jobs: పదితో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 81,000 జీతం.. డోంట్ మిస్

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×