E-Paper
Advertisement

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

UP News: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరైయా ప్రాంతంలో రాఖీ పండుగ జరిగినే రోజు దారుణ హత్య జరిగింది. 33 ఏళ్ల సూర్జీత్ అనే వ్యక్తి తన 14 ఏళ్ల బంధువైన బాలికపై అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను దారుణంగా హత్య చేశాడు. చివరకు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డెడ్ బాడీని ఫ్యాన్ కు ఉరి వేసి వేలాడదీశాడు. ఈ ఘటన పోలీసులను, స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాఖీ పండుగ రోజు, శనివారం ఉదయం సూర్జీత్ తన మామ ఇంటికి వెళ్లారు. తన బంధువైన ఆ బాలిక చేత రాఖీ కట్టించుకున్నాడు. అనంతరం సూర్జీత్ బయటకు వెళ్లి పీకల దాకా మద్యం సేవించి మళ్లీ ఇంటికి వెళ్లాడు. అప్పటికే నిద్రలో ఉన్న 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడు. అనంతరం బాలిక ఎక్కడ కుటుంబ సభ్యులకు చెబుతుందోనని ఆమెను హత్య కిరాతకంగా చేశాడు. తర్వాత, ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె డెడ్ బాడీని ఫ్యాన్ కు ఉరి వేసి వేలాడదీశాడు. ఆ బాలిక తండ్రి అదే ఇంటిలో వేరే గదిలో నిద్రిస్తున్నాడు. మరో రూంలో జరుగుతోన్న ఈ ఘటన గురించి ఆయనకు తెలియదు. మరుసటి రోజు ఉదయం బాలిక డెడ్ బాడీని చూసిన తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

ALSO READ: Dog video: పిల్లలపై వీధి కుక్క దాడి.. హీరోలో వచ్చి కాపాడిన పెంపుడు కుక్క.. వీడియో వైరల్

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా.. వెంటనే ఇది ఆత్మహత్య కాదని గుర్తించారు. ఇంటిలోని వివిధ ప్రదేశాల్లో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు కచ్చితంగా ఇది హత్యేనని పేర్కొన్నారు. విచారణ సమయంలో సూర్జీత్ కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. వారిని మాట్లాడనీయకుండా.. వారి తరపున సమాధానాలు ఇస్తూ పోలీసులకు అనుమానం కలిగించాడు. ఔరైయా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిజీత్ శంకర్ వివరణ ప్రకారం.. పోస్టుమార్టంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. సూర్జీత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతను నేరాన్ని అంగీకరించాడని ఆయన తెలిపారు.

ALSO READ: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుకూలించని వాతావరణం.. ఐదు విమానాలు మళ్లింపు

ఈ దారుణ ఘటన స్థానిక సమాజంలో తీవ్ర ఆగ్రహాన్నిచ, భయాన్ని కలిగించింది. రాఖీ వంటి పవిత్రమైన పండుగ రోజున, బంధుత్వాన్ని అవమానకరంగా మార్చిన ఈ దారుణం బాలికల భద్రతపై మరోసారి ప్రశ్నలకు దారి తీసింది. పోలీసులు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. న్యాయం కోసం కుటుంబం ఎదురుచూస్తోంది. ఇలాంటి నీచులకు పోలీసులకు  కఠిన శిక్ష వేయాలని నెటిజన్లు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×