E-Paper
Advertisement

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?
Advertisement

UP News: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరైయా ప్రాంతంలో రాఖీ పండుగ జరిగినే రోజు దారుణ హత్య జరిగింది. 33 ఏళ్ల సూర్జీత్ అనే వ్యక్తి తన 14 ఏళ్ల బంధువైన బాలికపై అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను దారుణంగా హత్య చేశాడు. చివరకు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డెడ్ బాడీని ఫ్యాన్ కు ఉరి వేసి వేలాడదీశాడు. ఈ ఘటన పోలీసులను, స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాఖీ పండుగ రోజు, శనివారం ఉదయం సూర్జీత్ తన మామ ఇంటికి వెళ్లారు. తన బంధువైన ఆ బాలిక చేత రాఖీ కట్టించుకున్నాడు. అనంతరం సూర్జీత్ బయటకు వెళ్లి పీకల దాకా మద్యం సేవించి మళ్లీ ఇంటికి వెళ్లాడు. అప్పటికే నిద్రలో ఉన్న 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడు. అనంతరం బాలిక ఎక్కడ కుటుంబ సభ్యులకు చెబుతుందోనని ఆమెను హత్య కిరాతకంగా చేశాడు. తర్వాత, ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె డెడ్ బాడీని ఫ్యాన్ కు ఉరి వేసి వేలాడదీశాడు. ఆ బాలిక తండ్రి అదే ఇంటిలో వేరే గదిలో నిద్రిస్తున్నాడు. మరో రూంలో జరుగుతోన్న ఈ ఘటన గురించి ఆయనకు తెలియదు. మరుసటి రోజు ఉదయం బాలిక డెడ్ బాడీని చూసిన తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

Advertisement

ALSO READ: Dog video: పిల్లలపై వీధి కుక్క దాడి.. హీరోలో వచ్చి కాపాడిన పెంపుడు కుక్క.. వీడియో వైరల్

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం విచారణ చేపట్టగా.. వెంటనే ఇది ఆత్మహత్య కాదని గుర్తించారు. ఇంటిలోని వివిధ ప్రదేశాల్లో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు కచ్చితంగా ఇది హత్యేనని పేర్కొన్నారు. విచారణ సమయంలో సూర్జీత్ కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. వారిని మాట్లాడనీయకుండా.. వారి తరపున సమాధానాలు ఇస్తూ పోలీసులకు అనుమానం కలిగించాడు. ఔరైయా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిజీత్ శంకర్ వివరణ ప్రకారం.. పోస్టుమార్టంలో బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. సూర్జీత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతను నేరాన్ని అంగీకరించాడని ఆయన తెలిపారు.

Advertisement

ALSO READ: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుకూలించని వాతావరణం.. ఐదు విమానాలు మళ్లింపు

ఈ దారుణ ఘటన స్థానిక సమాజంలో తీవ్ర ఆగ్రహాన్నిచ, భయాన్ని కలిగించింది. రాఖీ వంటి పవిత్రమైన పండుగ రోజున, బంధుత్వాన్ని అవమానకరంగా మార్చిన ఈ దారుణం బాలికల భద్రతపై మరోసారి ప్రశ్నలకు దారి తీసింది. పోలీసులు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. న్యాయం కోసం కుటుంబం ఎదురుచూస్తోంది. ఇలాంటి నీచులకు పోలీసులకు  కఠిన శిక్ష వేయాలని నెటిజన్లు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×