BigTV English

Hyderabad News: పొద్దుపొద్దున్నే ఘోర ప్రమాదం.. ఒకరు సజీవ దహనం

Hyderabad News: పొద్దుపొద్దున్నే ఘోర ప్రమాదం.. ఒకరు సజీవ దహనం

Hyderabad News:హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారు జామున దాసరి సంజీవయ్య కాలనీలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో జలగం సాయి సత్య శ్రీనివాస్ (32) మంటల్లో సజీవ దహనం అయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..? అని పరిశీలిస్తున్నారు. మృతుడిని ఏపీ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


పటాన్‌చెరు రుద్రాంలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో సత్య శ్రీనివాస్ గత కొన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు.  సత్య శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేకుంటే హత్యనా..? లేదా ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
హైదరాబాద్,  పాత బస్తీలోని కిషన్‌బాగ్‌లో కూడా ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్కూట్‌తో నాలుగంతస్తుల భవనం సెల్లార్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం సెల్లార్ నుంచి నాలుగో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. భవనంలో ఉన్నవారు అప్రమత్తం కావడంతో  అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×