E-Paper
Advertisement

Hyderabad News: పొద్దుపొద్దున్నే ఘోర ప్రమాదం.. ఒకరు సజీవ దహనం

Hyderabad News: పొద్దుపొద్దున్నే ఘోర ప్రమాదం.. ఒకరు సజీవ దహనం

Hyderabad News:హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారు జామున దాసరి సంజీవయ్య కాలనీలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో జలగం సాయి సత్య శ్రీనివాస్ (32) మంటల్లో సజీవ దహనం అయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..? అని పరిశీలిస్తున్నారు. మృతుడిని ఏపీ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పటాన్‌చెరు రుద్రాంలోని ఓ రసాయన ఫ్యాక్టరీలో సత్య శ్రీనివాస్ గత కొన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేశారు.  సత్య శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేకుంటే హత్యనా..? లేదా ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
హైదరాబాద్,  పాత బస్తీలోని కిషన్‌బాగ్‌లో కూడా ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్కూట్‌తో నాలుగంతస్తుల భవనం సెల్లార్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం సెల్లార్ నుంచి నాలుగో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. భవనంలో ఉన్నవారు అప్రమత్తం కావడంతో  అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×