E-Paper
Advertisement

Father Killed Son in Medak: మెదక్‌లో ఘోరం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి!

Father Killed Son in Medak: మెదక్‌లో ఘోరం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి!
Advertisement

Man Loses Rs.2 Crore in Betting killed by Father in Medak: నేటి కాలంలో యువత బెట్టింగ్ అనే వ్యసనానికి బానిసవుతున్నారు. బెట్టింగ్ మోజులో పడి నేటి యువత ఆన్ లైన్ గేమ్ లకు, బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ గేమ్స్ మాయలో పడి లక్షలకొద్ది డబ్బును పోగొట్టుకుంటున్నారు. చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకొని తల్లి దండ్రులకు కడుపుకోత మిగిల్చి వెల్తున్నారు.

ఒకప్పుడు ఎవరికి తెలయకుండా కొందిరి వ్యక్తుల మధ్య బెట్టింగ్ లు జరిగేవి కాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చేశాయి. కొందరు కేటుగాళ్లు బెట్టింగ్ ల రూపంలో అమాయకులను మోసం చేసి వారిదగ్గర డబ్బులు కొల్లగొడుతున్నారు. దీంతో వారు వారి సమస్యలను ఎవరి చెప్పుకొలేక, అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.

Advertisement

అయితే తాజాగా బెట్టింగ్ లో రెండు కోట్లు పోగొట్టున్న కొడుకుని చూసి ఆ తండ్రి పట్టరాని కోపంతో కన్న కొడుకుని రాడ్డుతో కొట్టి చంపాడు. ఈ విషాదకరమైన ఘటన శనివారం రాత్రి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బగిరాత్ కు చెందిన ముకేష్ కుమార్ అనే వ్యక్తి (28) రైల్వే ఉద్యేగం చేస్తున్నాడు. అతను గత కొంతకాలంగా ఆన్ లైన్ గేమ్ ఆడటం, జల్సాలు చేయడం, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అది గమనించిన అతని తండ్రి సత్యనారాయణ ఎన్నో సార్లు హెచ్చరించాడు. అలవాట్లు మానుకోమని బ్రతిమిలాడాడు. కాని అతను మాత్రం పద్ధతి మార్చుకోలేదు.

Also Read: మైనర్ పై గ్యాంగ్ రేప్.. పేట్రేగిపోయిన నీచులు

Advertisement

పైగా బెట్టింగ్ చేసి రెండు కోట్లు పోగొట్టాడు.. దీంతో సత్యనారాయణకు పట్టరాని కోపంతో ఆవేశంతో కొడుకు తలపై బలంగా రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సొంత ఊరిలో ఉన్న ఇల్లు, ప్లాట్లు, పొలాలు అమ్మేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముకేశ్‌ కుమార్‌ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్ లైన్ గేమ్స్ వల్ల ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×