E-Paper
Advertisement

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Son Kills Parents: హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. శివనగర్ కాలనీలో నివసిస్తున్న బరిగే లక్ష్మి, రాజయ్య దంపతులు తమ స్వంత కుమారుడి చేతిలోనే దారుణంగా మృతి చెందారు.

ఘటన ఎలా జరిగింది?

ప్రాథమిక సమాచారం ప్రకారం, లక్ష్మి-రాజయ్య దంపతుల రెండవ కుమారుడు శ్రీనివాస్ మద్యపానానికి బానిసయ్యాడు. తరచూ మందు కోసం డబ్బులు అడగడం, ఇంట్లో గొడవలు చేయడం తరుచూ చేస్తుండేవాడు. ఆదివారం రాత్రి కూడా అదే తరహాలో శ్రీనివాస్ డబ్బులు అడగగా, తల్లిదండ్రులు ఇవ్వలేమని ఖచ్చితంగా చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్.. కర్రతో దంపతులపై అమానుషంగా దాడి చేశాడు. తలకు బలంగా తగలడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

మానసిక సమస్యలు కూడా కారణమా?

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, శ్రీనివాస్‌కు కొంతకాలంగా మానసిక సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌ నుంచి ఆయనను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మానసిక స్థితి పూర్తిగా కోలుకోకముందే.. ఈ ఘోరానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కుటుంబ నేపథ్యం

లక్ష్మి, రాజయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వారిలో రెండవ కుమారుడే ఈ దారుణానికి కారణమయ్యాడు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరిక

సమాచారం అందుకున్న వెంటనే నేరేడ్మెట్ పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

స్థానికుల ఆవేదన

ఈ దారుణ ఘటనతో శివనగర్ కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లలను పెంచుతారు. అలాంటి వారిని స్వంత కొడుకు ఇంత క్రూరంగా చంపేయడం దారుణ విషయం. మద్యం, మానసిక సమస్యలు రెండు కలిసి ఈ దారుణ ఘటనకు ఒడిగట్టాడని స్థానికులు వాపోయారు.

నిపుణుల అభిప్రాయం

కుటుంబంలో మద్యపానం, మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయడం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారిని సమయానికి చికిత్స చేయడం, కౌన్సెలింగ్ అందించడం తప్పనిసరి అని వారు సూచిస్తున్నారు.

Also Read: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

నేరేడ్మెట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సమాజాన్ని కలచివేసింది. కన్న తల్లిదండ్రులను స్వంత కుమారుడే ఇంత అమానుషంగా హతమార్చడం మానవత్వాన్ని ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్లింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, స్థానికులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ స్థాయిలో చర్యలు అవసరమని డిమాండ్ చేస్తున్నారు.

 

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×