BigTV English
Advertisement

Guntur News: గుంటూరు జిల్లాలో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

Guntur News: గుంటూరు జిల్లాలో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

Guntur News: గుంటూరు జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లాలో వాగు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని పెదనందిపాడు మండలం అనపర్రులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలోనే ఒక్కసారి గా పిడుగు పడింది. దీంతో ఇద్దరు మహిళలు స్పాట్ లోనే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ALSO READ: Weather News: ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వర్షం.. పిడుగులు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి

జిల్లాలోని పెదనందిపాడు మండలం అనపర్రు గ్రామంలో ఇద్దరు మహిళలు ఇవాళ కూలీ పనికి వెళ్లారు. పొలంలో పని చేస్తుండగా భారీ వర్షం పడింది. ఇదే సమయంలో ఒక్కసారిగా భారీ ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికి అక్కడే చనిపోయారు. మృతులను సామ్రాజ్యం, నాగమ్మలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇద్దరు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తోటి కూలీలు పిడుగు పడి అకస్మాత్తుగా మృతి చెందడంతో మిగిలిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.


ALSO READ: Japan Population: జపాన్‌లో వందేళ్లకు పైబడిన వారు 1,00,000 చేరువలో.. కారణం ఇదేనట

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపార. భారీ వర్షాల నేపథ్యంలో పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద నిలబడకూడదని వివరించారు. వీలైనంత త్వరగా పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Related News

Hyderabad Crime: ఫ్రెండ్స్‌తో పార్టీ.. మరుసటి రోజు ఎయిర్‌‌హోస్టెస్‌ సూసైడ్, ఆ వార్తలపై ఫ్యామిలీ క్లారిటీ

Chennai Crime: చెన్నైలో దారుణం.. మహిళపై లైంగిక దాడి, బైక్ ట్యాక్సీ డ్రైవర్ అరెస్ట్

Indian Man: విమానంలో భారతీయుడు వీరంగం.. ఇద్దరు టీనేజర్లపై దాడి, నిందితుడి ప్రణీత్ అరెస్ట్

Crime in Flight: విమానంలో మెటల్ ఫోర్క్‌తో ఇద్దరిని పొడిచాడు.. సిబ్బంది అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటకీ..?

Travel Bus Burnt: ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్దం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Acid Attack Case New Twist: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో కీలక మలుపు, బాధితురాలి తండ్రి అరెస్ట్

Medak News: కర్నూల్ బస్సు ప్రమాదం.. 3రోజుల తర్వాత తల్లీకూతుళ్ల అంత్యక్రియలు, స్థానికుల కంటతడి

Kurnool Bus Accident: వీడని మృత్యువు.. కర్నూలు మృతుల అంత్యక్రియలకు వెళ్లొస్తూ..

Big Stories

×