BigTV English

Guntur News: గుంటూరు జిల్లాలో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

Guntur News: గుంటూరు జిల్లాలో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

Guntur News: గుంటూరు జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లాలో వాగు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని పెదనందిపాడు మండలం అనపర్రులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలోనే ఒక్కసారి గా పిడుగు పడింది. దీంతో ఇద్దరు మహిళలు స్పాట్ లోనే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ALSO READ: Weather News: ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వర్షం.. పిడుగులు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి

జిల్లాలోని పెదనందిపాడు మండలం అనపర్రు గ్రామంలో ఇద్దరు మహిళలు ఇవాళ కూలీ పనికి వెళ్లారు. పొలంలో పని చేస్తుండగా భారీ వర్షం పడింది. ఇదే సమయంలో ఒక్కసారిగా భారీ ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికి అక్కడే చనిపోయారు. మృతులను సామ్రాజ్యం, నాగమ్మలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇద్దరు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తోటి కూలీలు పిడుగు పడి అకస్మాత్తుగా మృతి చెందడంతో మిగిలిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.


ALSO READ: Japan Population: జపాన్‌లో వందేళ్లకు పైబడిన వారు 1,00,000 చేరువలో.. కారణం ఇదేనట

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపార. భారీ వర్షాల నేపథ్యంలో పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద నిలబడకూడదని వివరించారు. వీలైనంత త్వరగా పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Related News

Komuram Bheem District: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు కూతుర్లు మృతి

Nellore Murder Case: నీతో మాట్లాడాలని ఉంది.. ఫ్రెండ్‌ను రూమ్‌కి పిలిచి కత్తితో కస కస పొడిచి..

ZPHS school: ఇవ్వేం పనులురా వెధవ! విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

Medak News: అమ్మకాదు.. కామపిశాచి.. ప్రియుడితో కలిసి 2 ఏళ్ల కుమార్తెను చంపేసింది

Husband kills Wife: పట్టపగలు నడిరోడ్డుపై.. భార్యను కాల్చి చంపిన భర్త

Viral accident video: నిద్రమత్తు.. రెప్పపాటులో ప్రమాదం.. వీడియో వైరల్

Karnataka Incident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. దూసుకెళ్లిన ట్రక్కు.. స్పాట్‌లో 29 మంది

Big Stories

×