E-Paper
Advertisement

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. ఆ వారసుడి కెరీర్‌ను కాపాడుతుందా.?

Sai Pallavi: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. ఆ వారసుడి కెరీర్‌ను కాపాడుతుందా.?

Sai Pallavi: ఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా చాలావరకు హీరోకు, దర్శకుడికే వెళ్తుంది. కానీ ఫ్లాప్ అయితే మాత్రం వెంటనే అందులో నటించిన హీరోయిన్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక హీరోయిన్ నటించిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు హిట్ అయితే తనను గోల్డోన్ లెగ్ అని, ఫ్లాప్ అయితే ఐరెన్ లెగ్ అని ముద్రవేసేస్తారు. అది తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొందరు హీరోయిన్స్ మాత్రమే హిట్, ఫ్లాప్‌కు సంబంధం లేకుండా తమ నటనతో ఆకట్టుకొని ఆఫర్లు సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. సౌత్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి.. బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకోనుంది.

హీరోయిన్‌పై నమ్మకం

చాలామంది సౌత్ హీరోయిన్లు ఇక్కడ పాపులారిటీ వచ్చిన తర్వాత బాలీవుడ్‌కు వెళ్లడం సహజమే. కానీ అక్కడ కూడా సక్సెస్ అయినవారు చాలా తక్కువమంది ఉన్నారు. తాజాగా కీర్తి సురేశ్ కూడా బాలీవుడ్‌కు వెళ్లి ఎన్నో ట్రోల్స్ ఎదుర్కుంది. మరి బాలీవుడ్‌లో సాయి పల్లవి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది. ప్రస్తుతం సాయి పల్లవి ఫ్యూచర్ మాత్రమే కాదు.. ఒక బాలీవుడ్ స్టార్ హీరో వారసుడి ఫ్యూచర్ కూడా తన చేతిలోనే ఉంది. మామూలుగా ఈ హీరోయిన్ నటించిందంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుందని నమ్మి థియేటర్లకు వచ్చి చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు ఆ బాలీవుడ్ స్టార్ హీరో వారసుడిని కూడా సాయి పల్లవి (Sai Pallavi) అలాగే కాపాడాలి.

Also Read: బుట్టబొమ్మ భయపెడుతుందా.. మాకు నమ్మకం లేదు దొరా..?

వారసుడి ఎంట్రీ

బాలీవుడ్‌లో ఎంతోమంది వారసులు ఉండగా అందులో అమీర్ ఖాన్ వారసుడు కూడా యాడ్ అయ్యాడు. నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలయిన ‘మహారాజా’ మూవీతో అమీర్ వారసుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ప్రతీ నెపో కిడ్‌లాగానే జునైద్ యాక్టింగ్‌పై కూడా విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఇప్పుడు నేరుగా వెండితెరపై వెలగడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే జునైద్ హీరోగా నటిస్తున్న ‘లవ్యాపా’ అనే మూవీ షూటింగ్ ప్రారంభయ్యింది. దానికంటే ముందే సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ‘ఏక్ దిన్’ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ రెండూ 2025లో విడుదలకు సిద్ధమయ్యాయి.

రెండూ ఒకేసారి

జునైద్ ఖాన్ (Junaid Khan) హీరోగా నటిస్తున్న ‘లవ్యాపా’, ‘ఏక్ దిన్’.. ఈ రెండు సినిమాలు రొమాంటిక్ డ్రామాలుగానే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ‘లవ్యాపా’ సినిమా ఎలా ఉంటుందని తెలియదు కానీ ‘ఏక్ దిన్’పై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి ముఖ్య కారణం సాయి పల్లవి. తను నేరుగా హిందీలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా తన యాక్టింగ్ టాలెంట్ గురించి బీ టౌన్ ప్రేక్షకులకు కూడా తెలుసు. అందుకే నితేష్ తివారీ లాంటి దర్శకుడు సైతం సాయి పల్లవిని ‘రామాయణ్’లో సీతగా సెలక్ట్ చేశాడు. అసలైతే సాయి పల్లవి ముందుగా ‘రామాయణ్’ సినిమానే సైన్ చేసినా.. ‘ఏక్ దిన్’ మాత్రం ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×