E-Paper
Advertisement

Manoj VS Mohan Babu :కోర్టు ముందే దూషించుకున్న తండ్రీ కొడుకులు.. పరువు మొత్తం పాయే..!

Manoj VS Mohan Babu :కోర్టు ముందే దూషించుకున్న తండ్రీ కొడుకులు.. పరువు మొత్తం పాయే..!
Advertisement

Manoj VS Mohan Babu :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబంలో గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరిగిందని మంచు మనోజ్ (Manchu Manoj).. తన తండ్రి మోహన్ బాబు(Mohan babu ) తో గొడవ పడుతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. దీనికి తోడు పోలీస్ స్టేషన్, కోర్టు అంటూ తిరుగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి సందర్భంగా తిరుపతిలో జరిగిన గొడవ తర్వాత..మంచు మోహన్ బాబు.. మనోజ్ తన ఇంట్లో అక్రమంగా ఉంటున్నాడని, మనోజ్ ను తన ఇంటి నుండి ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో విన్నవించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు మనోజ్, మోహన్ బాబు కలెక్టరేట్ వద్ద హాజరయ్యారు.

కలెక్టరేట్ కి చేరుకున్న మోహన్ బాబు, మనోజ్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రేట్ కి చేరుకున్న సినీ నటులు మంచు మోహన్ బాబు.. తన ఆస్తులను కొంతమంది అక్రమంగా కబ్జా చేశారని, సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం వారిని ఖాళీ చేయించాలని కలెక్టర్ ను కోరగా.. మంచు మనోజ్ కూడా అదే కలెక్టర్ తో తనకు ఆస్తుల వాటా కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి మనోజ్ తో పాటు మోహన్ బాబు కూడా చేరుకున్నారు. ఆస్తి తగాదాల విషయంలో హాజరైన వీరు తన ఆస్తులను అక్రమంగా ఆక్రమించారని మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. నా కష్టార్జితంపై ఎవరికీ హక్కు లేదని తెలిపిన ఆయన, తన ఆస్తులు తనకు అప్పగించాలని అభ్యర్థించారు. అంతేకాదు తాను ఒక సీనియర్ సిటిజన్ అని కూడా పేర్కొన్నారు.

మెజిస్ట్రేట్ బయట గొడవపడ్డ తండ్రీ కొడుకులు..

Advertisement

ఇకపోతే ఈ విషయంలో అటు మంచు మోహన్ బాబు మంచు మనోజ్ ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారు. ముఖ్యంగా వీరి గొడవను చూసిన పోలీసులు ఇక్కడ గొడవ పదొడ్డని గట్టిగా చెప్పడంతో బయటకు వెళ్ళిపోయారు. ఇకపోతే మేజిస్ట్రేట్ లో దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. ఆస్తి తగాదాకి సంబంధించి ప్రతిమ సింగ్ కి పూర్తి వివరాలు అందజేశారు. అనంతరం మేజిస్ట్రేట్ నుండి బయటకు వచ్చిన మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు మేజిస్ట్రేట్ వద్ద ఇద్దరూ దూషించుకున్నారు. ఇక అనంతరం మీడియాతో మాట్లాడకుండా మంచు మనోజ్ ఆవేశంతో వెళ్లిపోయారు. వచ్చేవారం మరొకసారి మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరుకావాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే తండ్రి కొడుకులిద్దరూ కూడా ఆస్తి కోసం ఇలా కోర్టు ముందు గొడవ పడడంతో ఉన్న పరువు కూడా పోయింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ తండ్రి కొడుకులు ఆస్తుల కోసం గొడవ పడుతుంటే అక్కడ విష్ణు తన సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం అంతేకాదు మరి కొంతమంది కాస్త చెలరేగుతూ.. ఆ కొడుకుకి ఈ గొడవలు ఏమీ పట్టవా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×