E-Paper
Advertisement

Sai Pallavi: ఆ సినిమా వదిలేసి మూడు రోజులకే పారిపోవాలనుకున్నా.. షాకింగ్ విషయం బయటపెట్టిన సాయి పల్లవి

Sai Pallavi: ఆ సినిమా వదిలేసి మూడు రోజులకే పారిపోవాలనుకున్నా.. షాకింగ్ విషయం బయటపెట్టిన సాయి పల్లవి

Sai Pallavi: ఆన్ స్క్రీన్ పాత్రలతో మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ తన క్యారెక్టర్‌తోనే ప్రేక్షకులకు దగ్గరయిన నటీనటులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. సాయి పల్లవి అనగానే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. తన స్టోరీ సెలక్షన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ ఫ్యాన్స్‌తో ఉండే పద్ధతి కూడా అలాగే ఉంటుంది. తను నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయేమో కానీ.. అందులో తన పాత్రలు మాత్రం ఆడియన్స్‌ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. తాజాగా తను ఒక సినిమా సెట్ నుండి మూడు రోజులకే పారిపోవాలి అనుకున్న విషయాన్ని తాజాగా బయటపెట్టింది.

నటన గుర్తుండిపోతుంది

‘ప్రేమమ్’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది సాయి పల్లవి (Sai Pallavi). అందులో తను చేసిన మలర్ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అలాంటి తను మెల్లగా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కూడా అడుగుపెట్టింది. ఇక్కడ కూడా ఎనలేని సక్సెస్ చూసింది. తాజాగా శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘అమరన్’ (Amaran)లో హీరోయిన్‌గా నటించి అందరినీ ఆకట్టుకుంది. అందులో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన నటన ఎలా అయితే గుర్తుండిపోతుందో.. ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటన అంతకంటే ఎక్కువే గుర్తుండిపోతుంది. అలాంటి సాయి పల్లవి తాజాగా తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

Also Read: అనుష్క బర్త్‌ డేకు స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ.. ‘ఘాటీ’ నుండి కీలక అప్డేట్

అసౌకర్యంగా అనిపించింది

తమిళంలో హీరో సూర్య సరసన ‘ఎన్‌జీకే’ (NGK) మూవీలో నటించింది సాయి పల్లవి. ఆ సినిమాలో సూర్య భార్యగా తనకు మంచి పేరొచ్చింది. ‘ఎన్‌జీకే’ను సెల్వరాఘవన్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టినప్పుడు తనకు మొదట్లో చాలా అసౌకర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. అందుకే మూడు రోజుల తర్వాత సినిమా వదిలేసి వెళ్లిపోదామనుకున్నానని బయటపెట్టింది. ‘‘నేను మొదట్లో ఎన్‌జీకే సెట్‌లో అడుగుపెట్టినప్పుడు నాకు ఆరోగ్యం బాలేక అలా అనిపించిందో ఏంటో తెలియదు కానీ చాలా అసౌకర్యంగా అనిపించింది. ప్రతీ షాట్ తర్వాత సెల్వ సార్‌కు అది నచ్చిందో లేదో సరిగా చెప్పకపోయేవాడు’’ అని వివరించింది సాయి పల్లవి.

ధనుష్ ధైర్యం చెప్పాడు

‘ఎన్‌జీకే’ సినిమాలో తన పర్ఫార్మెన్స్ బాగుందో లేదో తెలియక చాలా ఇబ్బందిపడేదాన్ని అని గుర్తుచేసుకుంది సాయి పల్లవి. అప్పటికే ‘మారి 2’ విడుదల అయిపోయింది కాబట్టి ధనుష్ తనకు తరచుగా ఫోన్ చేసేవాడని, అప్పుడు తన మానసిక పరిస్థితిని తనతో షేర్ చేసుకున్నానని తెలిపింది. ‘‘ధనుష్ నాకు ఫోన్ చేసి సెల్వా షూటింగ్‌లో ఏంటి పరిస్థితి అని అడిగేవాడు. నేను నా భయాలు చెప్పుకుంటే తను నాకు ధైర్యం చెప్పేవాడు. ఏం భయపడకు. ఆయన నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు అనేవాడు’’ అని చెప్పింది. అలా తను ఎంత టాలెంటెడ్ అయినా కూడా ఎప్పటికప్పుడు తనను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నంలోనే ఉంటుంది సాయి పల్లవి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×