E-Paper
Advertisement

UK Targets Indian Restaurants : ట్రంప్‌ బాటలో యుకె.. బ్రిటన్‌లో భారతీయ రెస్టారెంట్లపై దాడులు.. టార్గెట్ వారే!

UK Targets Indian Restaurants : ట్రంప్‌ బాటలో యుకె.. బ్రిటన్‌లో భారతీయ రెస్టారెంట్లపై దాడులు.. టార్గెట్ వారే!
Advertisement

UK Targets Indian Restaurants | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న తీరుని చూసి.. ఇదే మార్గంలో బ్రిటన్ కూడా అడుగులు వేస్తోంది. విదేశీ నేరగాళ్ళను, ముఖ్యంగా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించి పనులు చేస్తున్న వారిని లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ ప్రక్రియలో, ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లలో తనిఖీలు జరిపి అరెస్టులు చేస్తున్నారు.

తాజాగా, యూకే వైడ్ బ్లిట్జ్ (UK-wide blitz) పేరుతో వలసదారులు పనిచేస్తున్న భారతీయ రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. ఈ తనిఖీలతోపాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్లు, బార్లపై కూడా తనిఖీలు జరిపి వందల మందిని అరెస్టు చేసింది. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని యూకే హోం మంత్రిత్వ కార్యదర్శి వెట్టే కూపర్ తెలిపారు.

Advertisement

హంబర్సైడ్ ప్రాంతంలోని ఒక భారతీయ రెస్టారెంట్లో జరిపిన తనిఖీల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అలాగే, సౌత్ లండన్లోని ఒక భారతీయ గ్రాసరీ వేర్హౌస్లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోం శాఖ వర్గాలు వెల్లడించాయి.

అదుపులోకి తీసుకున్న వారిని డొనాల్డ్ ట్రంప్ స్టైల్లోనే బంధించి వెనక్కి పంపిస్తున్నారు. వారి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన వీడియోలను అక్కడి అధికారులు ఇటీవల విడుదల చేశారు. అయితే వారిలో నేరగాళ్ళు ఉండడం వల్లే ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సమర్థించుకుంటున్నారు.

Advertisement

Also Read: పాక్ చైనా సంయుక్త నౌకాదళ విన్యాసాలు.. హిందూ మహాసముద్రంలో భారత్‌కు డేంజర్?

చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు (Migrants) అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే, జనవరిలో దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు జరిపి, 609 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు.

బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కూడా ఈ విషయంపై సోమవారం స్పందించారు. “బ్రిటన్లో అక్రమ వలసలు పెరిగాయి. చాలామంది అక్రమంగా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ చట్టవిరుద్ధ వలసలను ముగిస్తాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరోవైపు, అక్రమ వలసదారుల అడ్డగింపు, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో సోమవారం చర్చ జరిగింది. అక్రమ వలసదారుల వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడమే కాకుండా, వలసలు వచ్చే ప్రక్రియలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని బ్రిటన్ ప్రజాప్రతినిధులు అందోళన వ్యక్తం చేశారు.

గత ఏడాది జులైలో బ్రిటన్ దేశంలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం సరిహద్దు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు దాదాపు 4,000 మంది అక్రమ కార్మికులను అరెస్టు చేసినట్లు యూకే హోం శాఖ గణాంకాలు తెలిపాయి. అయితే, తాజాగా భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×