E-Paper
Advertisement

Air India Boeing Crash: బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌ తయారీలో లోపాలు.. 2024లోనే హెచ్చరించిన ఇంజినీర్

Air India Boeing Crash: బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌ తయారీలో లోపాలు.. 2024లోనే హెచ్చరించిన ఇంజినీర్
Advertisement

Air India Boeing Crash| అహ్మదాబాద్ నుంచి లండన్ కోసం బయలుదేరిన ఎయిర్ విమానం గురువారం కూలిపోయింది. ఈ విమానంలో ఉన్నవారిలో ఒక్కరు మినహా దాదాపు అందరూ మరణించారు. పైగా ఈ విమానం కూలిపోయే సమయంలో ఒక వైద్య విద్యార్థుల హాస్టల్ పై పడింది. దీంతో అక్కడి విద్యార్థులు కూడా చనిపోయారు. ఈ దారుణ ఘటనలో మొత్తం 240 మందికి పైగా మరణించారు. అయితే ఇదంతా ఎలా జరిగింది.. దీనికి కారణాలేంటి అని ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బోయింగ్ విమాన తయారీ కంపెనీలో పనిచేసే ఒక ప్రముఖ ఇంజినీర్ సంవత్సరం క్రితం చేసిన హెచ్చరికలు ఇప్పుడు మీడియా హైలైట్ చేస్తోంది.

2024లో బోయింగ్ ఇంజినీర్ సామ్ సలేహ్‌పూర్.. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం నిర్మాణంలో సమస్యల గురించి హెచ్చరించారు. విమాన తయారీ భాగాలను సరిగ్గా జోడించడంలో బోయింగ్ వేగంగా వ్యవహరించదని.. ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన ఆ సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలతో అమెరికా విమానయాన సంస్థ (FAA) దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement

అయితే సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత.. అంటే జూన్ 2025లో, ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఫ్లైట్ AI171.. టేకాఫ్ జరిగిన అయిదు నిమిషాల తర్వాత కూలిపోయింది. 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఉన్న ఈ విమానం అహ్మదాబాద్‌లోని మేఘనీ నగర్ ప్రాంతంలో కూలి, 200 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు, సలేహ్‌పూర్ హెచ్చరికలతో దీనికి సంబంధం లేదని ప్రాథమికంగా తెలుస్తోంది. అయినా, ఈ ఘటన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌ లోని లోపాలపై, బోయింగ్ సంస్థపై మళ్లీ దృష్టి పడేలా చేసింది.

బోయింగ్ సంస్థ ఈ ప్రమాదంపై స్పందిస్తూ, ఎయిర్ ఇండియాతో సంప్రదిస్తున్నామని, సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. “ప్రయాణికులు, సిబ్బంది, సహాయకుల భద్రత గురించే మా ఆందోళన” అని బోయింగ్ తెలిపింది. 2011లో వాణిజ్య సేవలు ప్రారంభించిన డ్రీమ్‌లైనర్‌కు ఇదే మొదటి ప్రాణాంతక ప్రమాదం.

Advertisement

సలేహ్‌పూర్ హెచ్చరికల వివరాలు
బోయింగ్‌లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న సలేహ్‌పూర్, 2024 జనవరిలో విమానలో విడి భాగాల జోడింపులో లోపాలను గుర్తించారు. విమాన భాగాలను బలవంతంగా అతికించడంతో కొన్నిసార్లు కార్మికులకు గాయాలయ్యాయని ఆయన చెప్పారు. “ఇలా విమానం తయారు చేయడం సరికాదు” అని ఆయన అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్ఎన్ (CNN)కి చెప్పారు. ఈ లోపాలు 1,000 కంటే ఎక్కువ డ్రీమ్‌లైనర్‌లను ప్రభావితం చేశాయని, దీర్ఘకాలంలో విమానం విడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఆరోపణలపై FAA దర్యాప్తు చేస్తోంది. సలేహ్‌పూర్ బోయింగ్ 777 విమానాల్లో కూడా ఇలాంటి సమస్యలను గుర్తించారు.

బోయింగ్ ఈ ఆరోపణలను ఖండించి, విమానాలు సురక్షితమని, పరీక్షలు ఎలాంటి ప్రమాదం లేదని చూపించాయని చెప్పింది. అయినా, సలేహ్‌పూర్‌పై ప్రతీకార చర్యలు తీసుకున్నారని, ఆయనను 777 ప్రోగ్రామ్‌కు బదిలీ చేశారని ఆయన న్యాయవాదులు చెప్పారు.

Also Read: లండన్‌లో సెటిలయ్యేందుకు వెళ్తూ.. ఫ్యామిలీ మొత్తం పైలోకాలకు.. డాక్టర్ విషాద గాధ!

బోయింగ్ ఇతర సమస్యలు: 787తో పాటు, బోయింగ్ 737 మాక్స్ విమానాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. 2019-2020లో రెండు 737 మాక్స్ ప్రమాదాల్లో 346 మంది మరణించారు. 2024లో అలస్కా ఎయిర్‌లైన్స్ 737 మాక్స్ 9 విమానంలో డోర్ ప్లగ్ పేలడంతో మరోసారి నిషేధం విధించారు. ఈ ఘటనలు బోయింగ్ నాణ్యత నియంత్రణపై అనుమానాలను పెంచాయి.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×