E-Paper
Advertisement

Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?

Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?

Indian Student Died in America

Indian Student Died in America(Telugu news headlines today): అమెరికాలో మరణిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు.. కారణం ఏదైనా అక్కడ మరణిస్తున్న ఇండియా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు న్యూయార్క్ లోని భారత్ కాన్సులేట్ వెల్లడించింది. ఓహియోలో ఉంటున్న గద్దె ఉమా సత్యసాయి అకాల మరణం చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి.. అతని మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : మరోసారి రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడ ఉంటున్న భారత విద్యార్థులకు భద్రత కరువైందని ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. మరో విద్యార్థి మరణించడం మరింత ఆందోళనకు దారితీసింది. ఉమా సత్యసాయి అకాలమరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే హైదరాబాద్ కు చెందిన పాతికేళ్ల మహ్మద్ అబ్దుల్ అరాఫత్ అనే విద్యార్థి మిస్సవ్వడం అతని కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. నీల్ ఆచార్య, వివేక్ సైనీల ఘటనలు మరువక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×