E-Paper
Advertisement

Breast cancer: 2040 నాటికి పెరగనున్న రొమ్ము కాన్సర్ మరణాలు.. ఏటా 10 లక్షల మరణాలు

Breast cancer: 2040 నాటికి పెరగనున్న రొమ్ము కాన్సర్ మరణాలు.. ఏటా 10 లక్షల మరణాలు
Advertisement

Breast Cancer To Cause A Million Deaths By 2040: ప్రపంచవ్యాప్తంగా రొమ్ము కాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. రొమ్ము కాన్సర్ ఎక్కువగా మహిళల్లో వ్యాపిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రేటు పెరుగుతోందని ఇటీవలి అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేశాయి, 2040 నాటికి రొమ్ము క్యాన్సర్  కేసులు, దాని వల్ల మరణాల రేటు చాలా రెట్లు పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

2040 నాటికి రొమ్ము క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం ఒక మిలియన్ మంది చనిపోతారని లాన్సెట్ కమిషన్ హెచ్చరించింది. ఇప్పుడు కూడా ఈ క్యాన్సర్ కారణంగా ఏటా 6-7 లక్షల మంది మహిళలు మరణిస్తున్నారు, ఈ మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నివేదికలు తెలిపాయి.

Breast Cancer To Cause A Million Deaths By 2040
Breast Cancer To Cause A Million Deaths By 2040
Advertisement

లాన్సెట్ కమిషన్ నివేదిక ప్రకారం 2020 చివరి వరకు ఐదేళ్లలో సుమారు 7.8 మిలియన్ల (78 లక్షలకు పైగా) మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని  దాదాపు 6.85 లక్షల మంది మహిళలు ఈ వ్యాధితో మరణించారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసులు 2020లో 23 లక్షల నుండి 2040 నాటికి 30 లక్షలకు పెరుగుతాయని అంచనా వేసింది.

Also Read: వానొచ్చే వరదొచ్చే.. మునిగిన దుబాయ్ ఎయిర్‌పోర్టు

Advertisement

ముఖ్యంగా ఈ కేసులు చాలా వరకు పేద, వర్దమాన దేశాల నుండి సంభవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ధనిక దేశాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆధునిక వసతులు, ప్రజల చైతన్యం కల్పించడం వల్ల మరణాల రేటును కొంత వరకు తగ్గించగలుగుతున్నారని నివేదిక కమిషన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన షార్లెట్ కోల్స్ వెల్లడించారు.

భారతీయ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు నిరంతరం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దక్షిణాఫ్రిక వంటి దేశాల్లో 40 శాతం మంది కేన్సర్ బారినుండి బయటపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి. ప్రజల్లో ఇంకా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం, సరైన ఆహారం తీసుకోవడం, అధిక బరువును తగ్గించుకోవడం, మధ్యం వినియోగం నియంత్రణ, వంటి చేయడం వల్లన కాన్సర్ బారిన పడే అవకాశాలు కొంత వరకు నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×