E-Paper
Advertisement

Telangana Student Missing In Chicago: అమెరికాలో మిస్సవుతున్న భారతీయ విద్యార్థులు.. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్!

Telangana Student Missing In Chicago: అమెరికాలో మిస్సవుతున్న భారతీయ విద్యార్థులు.. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్!

Telangana Student Missing in Chicago: అమెరికాలో భారతీయ విద్యార్థుల మిస్సింగ్, మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికాలోని చికాగోలో భారతీయ స్టూడెంట్ అదృశ్యమయ్యాడు.మే రెండున చింతకింది రూపేశ్ అనే స్టూడెంట్ మిస్సయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చికాగోలోని భారత రాయబారి కార్యాలయం వెల్లడించింది. మే రెండు నుంచి రూపేశ్ కనిపించలేదని, అతడి ఆచూకీ కోసం పోలీసులు శ్రమిస్తున్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. అతడి గురించి సమాచారం తెలిస్తే వెంటనే అందించాలని స్థానికులను కోరింది.

తెలంగాణకు చెందిన రూపేశ్ చికాగోలోని విస్కాన్సిన్‌లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఈయన సొంతూరు హనుమకొండ జిల్లా. ఈ విషయం చికాగోలోని రాయబారి కార్యాలయం ద్వారా తెలియగానే అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రూపేశ్ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. టెక్సాస్‌లో ఓ వ్యక్తి వద్దకు వెళ్లినట్టు చెబుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తమకు తెలీదని రూమ్‌మేట్స్ మాట.

అమెరికాలో తన కొడుకు రూపేశ్ మిస్సింగ్ వ్యవహారాన్ని ఆయన ఫాదర్ సదానందమ్.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విదేశాంగ‌శాఖకు ఓ లేఖ రాశారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ.. అమెరికా ఎంబసీని అభ్యర్థించింది. తమ గడ్డపై భారతీయ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని అక్కడి పాలకులు చెబుతున్నారు. అయినా సరే జరగాల్సిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Also Read: గూచీ బెల్ట్ కొనిచ్చి విద్యార్థితో శృంగారం.. బెయిల్ పై బయటికొచ్చి మరో విద్యార్థితో..

ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికాలో ఈ తరహా ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దాడులు, కిడ్నాప్ వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇది వరుసగా ఐదో ఘటన. ఇటీవల పర్ఢ్యూ యూనివర్సిటీలో అనుమానాస్పద స్థితిలో ఇండియన్ స్టూడెంట్ మరణించాడు.

mysterious deaths of Indian students in US
mysterious deaths of Indian students in US

అంతకుముందు ఓహియో ప్రాంతంలో భారతి సంతతికి చెందిన 19 ఏళ్ల శ్రేయస్‌రెడ్డి ఇదే విధంగా మరణించాడు. జార్జియాలో లిథోనియాలో హర్యానాకు చెందిన వివేక్ సైనీని ఓ వ్యక్తి సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అంతకుముందు ఇల్లినాయిస్ యూనివర్సిటీ సమీపంలో భారతీయ-అమెరికన్ విద్యార్థి అకుల్‌ధావన్ శవమై కనిపించాడు. ఇలా వరసగా అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read: Teacher illegal Affair : గూచీ బెల్ట్ కొనిచ్చి విద్యార్థితో శృంగారం.. బెయిల్ పై బయటికొచ్చి మరో విద్యార్థితో..

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×