Israeli Airstrike on Iranian Embassy in Syria: ఇరాన్ మద్దతు దారులే టార్గెట్గా సిరియాలోపై ఇజ్రాయిల్ మరోసారి దాడులకు పాల్పడింది. సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీపై వైమానిక దాడి చేసింది. ఈ ఘటన రాజధాని డమాస్కస్ లో వెలుగుచూసింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇరాన్ కు చెందని సీనియర్ సైనిక సలహాదారుతో పాటు ఇతర సిబ్బంది కూడా మృతి చెందినట్లు స్పష్టం చేసింది. దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది.
ఇరాన్ ఎంబసీపై జరిగిన దాడి ఘటనలో కాన్సులర్ భవనం కుప్పకూలిన దాని పక్కనే రాయబార కార్యాలయం ఉంది. అయితే ఈ దాడిలో మరణించిన ఇరాన్ మిలిటరీ సలహాదారు జనరల్ అలీ రెజా జెహ్ దీ 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో పనిచేశారు. ఖుద్స్ బలగాలకు ఆయన నేతృత్వం వహించారు. అయితే ఈ దాడి ఘటనపై మాత్రం ఇజ్రాయిల్ స్పందించలేదు.
Also Read: తోషాఖానా అక్రమాస్తుల కేసు.. ఇమ్రాన్ ఖాన్ దంపతుల శిక్ష సస్పెండ్..
గత మూడు రోజుల క్రితం సిరియాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 44 మంది మృతి చెందారు. దీంతో మూడు రోజుల వ్యవధిలోనే మరోసారి దాడులకు పాల్పడిన ఇజ్రాయిల్ పై ప్రస్తుతం ప్రపంచ దేశాలు కన్నెర్ర జేశాయి.