E-Paper
Advertisement

LIBYA Boat Accident : డెత్ జర్నీ.. లిబియా తీరంలో ఘోర బోటు ప్రమాదం.. 61 మంది మృతి!

LIBYA Boat Accident : డెత్ జర్నీ.. లిబియా తీరంలో ఘోర బోటు ప్రమాదం.. 61 మంది మృతి!

LIBYA Boat Accident : యుద్ధాలు.. పేదరికం.. ఆకలి.. వీటి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆ వలసదారుల బతుకులు సముద్రం పాలయ్యాయి. ఉత్తర ఆఫ్రియా దేశమైన లిబియా తీరంలో పడవ మునిగి ఏకంగా 61 మంది మృతి చెందారు. వీరంతా లిబియా తీరంలోని జువారా నుంచి బయలుదేరి యూరప్‌ తీరానికి చేరుకోవాలనుకున్నారు. కానీ భయంకరమైన అలల తాకిడికి తట్టుకోలేక పడవ నీటిలో మునిగి వలసదారులు మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.

వీరంతా నైజీరియా, జాంబియాతో పాటు ఇతర ఆఫ్రికన్ దేశాలకు చెందిన మహిళలు, పిల్లలు సహా మొత్తం 86 మంది వలసదారులు ప్రమాద సమయంలో ఆ బోటులో ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 25 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్‌ లిబియా డిటెన్షన్‌ సెంటర్‌కి తరలించినట్లు IOM తెలిపింది.

ప్రాణాలతో బయటపడిన వారందరూ సురక్షితంగా ఉన్నారని IOM తెలిపింది. లిబియా, ట్యునీషియా ఇటలీ మీదుగా యూరప్‌కు చేరుకోవాలని వలసదారులు ప్లాన్ చేశారు. ఈ ఏడాది ట్యునీషియా, లిబియా నుంచి లక్షా 53 వేల మంది కంటే ఎక్కువ వలసదారులు ఇటలీకి చేరుకున్నారు. అయితే 2 వేల మందికి పైగా అనేక ప్రమాదాల కారణంగా మృతి చెందారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×