BigTV English

Tragedy In China: తీవ్ర విషాదం, 4 పడవలు బోల్తా.. 84 మంది ?

Tragedy In China: తీవ్ర విషాదం,  4 పడవలు బోల్తా.. 84 మంది ?

Tragedy In China: చైనాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుయిజౌ ప్రావిన్స్‌లోని  కియాంక్సి నగరంలో ఆదివారం పర్యాటకులతో వెళ్తున్న పడవలు బోల్తా పడ్డాయి. నాలుగు పడవలు ఒకే సారి బోల్తా పడటంతో 9 మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారు.


ఈ ప్రమాదం లిగువాంగ్ నదిలో జరిగింది. అధికారులు నివేదిక ప్రకారం.. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలి కారణంగా 4 పడవలు బోల్తా పడ్డాయి. నాలుగు పడవల్లో మొత్తం 84 మంది పర్యాటకులు ఉండగా.. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న వారందరూ నీటిలో పడిపోయారు.

ఈ ప్రమాదం తర్వాత.. సమాచారం అందుకున్న  దాదాపు 500 మంది రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. 74 మంది పర్యాటకులను సిబ్బంది రక్షించారు. ఇంకొకరి ఆచూకి కోసం వెతుకుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రాంతీయ అధికారులను ఆదేశించారు.


70 మంది పర్యాటకులను ఆసుపత్రికి తరలించారు:
ప్రమాదం తర్వాత.. స్థానిక అధికారులు 70 మంది పర్యాటకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ పెద్దగా గాయాలు కానప్పటికీ.. ముందు జాగ్రత్తగా అందరినీ ఆసుపత్రికి పంపించారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×