E-Paper
Advertisement

Tragedy In China: తీవ్ర విషాదం, 4 పడవలు బోల్తా.. 84 మంది ?

Tragedy In China: తీవ్ర విషాదం,  4 పడవలు బోల్తా.. 84 మంది ?
Advertisement

Tragedy In China: చైనాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుయిజౌ ప్రావిన్స్‌లోని  కియాంక్సి నగరంలో ఆదివారం పర్యాటకులతో వెళ్తున్న పడవలు బోల్తా పడ్డాయి. నాలుగు పడవలు ఒకే సారి బోల్తా పడటంతో 9 మంది మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారు.

ఈ ప్రమాదం లిగువాంగ్ నదిలో జరిగింది. అధికారులు నివేదిక ప్రకారం.. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలి కారణంగా 4 పడవలు బోల్తా పడ్డాయి. నాలుగు పడవల్లో మొత్తం 84 మంది పర్యాటకులు ఉండగా.. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న వారందరూ నీటిలో పడిపోయారు.

Advertisement

ఈ ప్రమాదం తర్వాత.. సమాచారం అందుకున్న  దాదాపు 500 మంది రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. 74 మంది పర్యాటకులను సిబ్బంది రక్షించారు. ఇంకొకరి ఆచూకి కోసం వెతుకుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రాంతీయ అధికారులను ఆదేశించారు.

70 మంది పర్యాటకులను ఆసుపత్రికి తరలించారు:
ప్రమాదం తర్వాత.. స్థానిక అధికారులు 70 మంది పర్యాటకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ పెద్దగా గాయాలు కానప్పటికీ.. ముందు జాగ్రత్తగా అందరినీ ఆసుపత్రికి పంపించారు.

Advertisement

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×