E-Paper
Advertisement

Pakistan Ahmadi Community: ‘ఆ సామాజిక వర్గంపై దాడులు ఆపండి’.. పాకిస్తాన్ కు ఐరాస మానవ హక్కుల సంఘం హెచ్చరిక

Pakistan Ahmadi Community: ‘ఆ సామాజిక వర్గంపై దాడులు ఆపండి’.. పాకిస్తాన్ కు ఐరాస మానవ హక్కుల సంఘం హెచ్చరిక
Advertisement

Pakistan Ahmadi Community| ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ పాకిస్తాన్ ప్రభుత్వంపై మండిపడింది. పాకిస్తాన్ లోని మైనారిటీలలో అహ్మదీ సామాజికవర్గంపై జరుగుతున్న హింసాత్మక దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని గురువారం చెప్పింది. పాకిస్తాన్ లో అహ్మదీ ముస్లింలపై జరుగుతున్న మూక దాడుల వల్ల హింస పెరిగిపోతోందని.. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని మానవ హక్కుల కౌన్సిల్ తెలిపింది.

19వ శతాబ్దంలో పాకిస్తాన్ ఏర్పడక ముందు పంజాబ్, బలూచిస్తాన్ ప్రాంతాలలో మిర్జా గులామ్ అహ్మద్ అనే వ్యక్తి తాను ఒక ప్రవక్త అని, దేవుడి తరపున వచ్చిన దూత అని ప్రకటించుకున్నాడు. ఆయన ముస్లింలకు తానే ప్రతినిధి అని ప్రకటన చేయగానే.. మత విద్వేషాలు చెలరేగాయి. ఇస్లాం మతం ప్రకారం.. ప్రవక్త మొహమ్మద్ చివరి ప్రవక్త.. ఆయన తరువాత మరో ప్రవక్త ఉండడు. కానీ పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ లో కొందరు మిర్జా గులామ్ అహ్మద్ కి అనుసరిస్తూ.. అహ్మదియా ముస్లింలుగా మారిపోయారు.

Advertisement

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సున్నీ ముస్లింలు ఈ అహ్మదియా ముస్లింలను బహష్కిరించారు. పాకిస్తాన్ ప్రభుత్వమైతే అహ్మదీలు అసలు ముస్లింలే కాదంటూ 1974లో పార్లమెంటులో ప్రకటించింది. అప్పటి నుంచి అహ్మది ముస్లింలపై పాకిస్తాన్ లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. జూలై నెలలోనే ఇద్దరు అహ్మదీలు మూకదాడిలో చనిపోయారు.

గత కొన్ని దశాబ్దాలుగా అహ్మదీ ముస్లింపై బాంబు దాడులు, మూక దాడుల ఘటనలు పెరిపోతున్నాయి. పాకిస్తాన్ లోని హాసిల్ పూర్ జిల్లాలో అహ్మదియా సామాజిక వర్గం అధ్యక్షుడని జూన్ నెలలో కాల్చి చంపారు. జూన్ నెలలోనే పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలో నిద్రపోతున్న ఏడుగురు అహ్మదీలపై కాల్పులు జరపడంతో అందరూ మరణించారు. చనిపోయిన వారంతా కూలీ పనిచేసుకునే వారని మీడియా తెలిపింది.

Advertisement

ఈ ఘటనలపై స్పందిస్తూ.. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంఘం పాకిస్తాన్ ప్రభుత్వానిక ఓ లేఖ రాసింది. ”పాకిస్తాన్ లో అహ్మదీ ముస్లింలపై జరుగుతున్న దాడులు ఆపేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. అహ్మదీ ముస్లింల ప్రార్థనా స్థలాలకు భద్రత కల్పించాలి”, అని ప్రభుత్వాన్ని మానవ హక్కువ కౌన్సిల్ కోరింది.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×