E-Paper
Advertisement

UN Security Council: హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత 8 నెలలుగా బీకర పోరు.. కాల్పుల విరమణ ప్రణాళికకు ఆమోదం!

UN Security Council: హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత 8 నెలలుగా బీకర పోరు.. కాల్పుల విరమణ ప్రణాళికకు ఆమోదం!
Advertisement

United Nations Security Council: హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత 8 నెలలుగా బీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోరుకు ముగింపు పలకాలన్న ఉద్దేశంతో తెరపైకి తీసుకొచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికకు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సోమవారం ఆమోదం తెలిపింది. అమెరికా ప్రతిపాదించినటువంటి ఈ తీర్మానానికి మండలిలోని 15 సభ్య దేశాల్లో 14 దేశాలు ఆమోదం తెలిపాయి. రష్యా మాత్రం ఓటింగ్ కు గైర్హాజరైంది. మూడు దశలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇజ్రాయెల్, హమాస్ లు తక్షణం అమలు చేయాలని ఈ తీర్మానం కోరింది. ఈ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గత నెలలో ప్రకటించారు.

కాల్పుల విరమణకు, యుద్ధానంతరం గాజా పాలనకు సంబంధించిన ప్రణాళికలకు మద్దతు కూడగట్టేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశం అయ్యారు. కాల్పుల విరమణ ప్రతిపాదన రావాల్సి ఉందని అన్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం ఉందని అమెరికా చెబుతున్నది. అయితే, అందులోని పలు అంశాలను నెతన్యాహు బహిరంగంగానే వ్యతిరేకించారు. హమాస్ ను అంతమొందించడానికే తాము ఇప్పటికే కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. సంధి ప్రయత్నాలపై హమాస్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందనైతే రాలేదు. భద్రతా మండలి తాజా తీర్మానాన్ని ఆ ముఠా స్వాగతించింది. కాల్పుల విరమణ అమలవుతుందన్న భరోసా తమకు ఉండాలంటూ స్పష్టం చేసింది. కొన్ని అంశాలపై స్పష్టత కావాలని, ఈ పోరుకు శాశ్వత ముగింపు పలకాలని తెలిపింది.

Advertisement

Also Read: ఎన్నికల వేళ.. బైడెన్‌కు ఊహించని షాక్, దోషిగా తేలిన కొడుకు హంటర్‌

అమెరికా – ఇజ్రాయెలీ గూఢచర్య నెట్ వర్క్ ను తాము భగ్నం చేసినట్లు యెమెన్ లో హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అయితే, కొద్దిరోజుల కిందట ఐక్య రాజ్య సమితి సిబ్బంది, దాతృత్వ సంస్థల సిబ్బందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

Advertisement

దక్షిణ గాజాలోని రఫాలో జరిగినటువంటి ఒక పేలుడులో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షాలిత్ అపహరణలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది ఓ భవనంలో ఉన్నాడంటూ సమాచారం అందడంతో ఆ భవనాన్ని పేల్చివేసేందుకు నెతన్యాహు సేన సిద్ధమైంది. అయితే, వారి వద్ద ఉన్నటువంటి పేలుడు పదార్థాలు ముందుగానే పేలడంతో నలుగురు సైనికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×