BigTV English

World War II Bomb Japan: ఇప్పుడు పేలిన ప్రపంచ యుద్ధం బాంబు.. జపాన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

World War II Bomb Japan: ఇప్పుడు పేలిన ప్రపంచ యుద్ధం బాంబు.. జపాన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

World War II Bomb Japan| జపాన్ లోని మియాజాకీ ఎయిర్ పోర్టులో బుధువారం అక్టోబర్ 2, 2024న ఓ భారీ బాంబు పేలుడు సంభవించింది. అయితే ఆ బాంబు 79 ఏళ్ల క్రితం పేలాల్సి ఉండగా.. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు పేలిపోవడం ఆశ్చర్య. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ పై అమెరికా వేసిన ఒక బాంబు ఇన్నాళ్లుగా పేలకుండా ఉండిపోయింది.


రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగా 1943లో నేవీ విమానాల రాకపోకల కోసం అప్పటి జపాన్ ప్రభుత్వం ఓ ఎయిర్ పోర్టు నిర్మించింది. అదే మియాజాకీ ఎయిర్ పోర్టు. ఆ ఎయిర్ పోర్టుపై అమెరికా 1945 సంవత్సరంలో ఓ భారీ బాంబు వేసింది. కానీ ఆ బాంబు భూమి లోపల ఉండిపోగా.. ఆ తరువాత కాలక్రమంలో దానిపై రన్ వే ఏర్పాడింది. అలా ఆ బాంబు భూమిలోపలే ఉండిపోయింది. అయితే అనూహ్యంగా ఆ బాంబు ఇప్పుడు పేలిపోవడం విశేషం. ఆ బాంబు రెండో ప్రపంచ యుద్ధ సమయంలోదే అని జపాన్ ట్రాన్స్‌పోర్ట్ మంత్రిత్వశాఖ ధృవీకరించింది.

Also Read:  బేరుట్‌లో కూలిపోయిన ఇళ్లు.. బాంబుల భయంతో రోడ్లపై నిద్రిస్తున్న వేలాది ప్రజలు..


ఈ బాంబు పేలుడు ప్రభావం తీవ్రంగా ఉండడంతో మియాజాకీ ఎయిర్ పోర్టులో 7 మీటర్ల వెడల్సు, 1 మీటర్ లోతు వరకు గుంత ఏర్పడింది. పేలుడు జరిగిన ప్రదేశంలో ఎయిర్‌పోర్టు లగేజీ ట్యాక్సీలు రాకపోకలు జరిగేవి. అదృష్టవశాత్తు పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఎవరూ లేరు. దీంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. పేలుడు కారణంగా ఎయిర్ పోర్టు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. మియజాకీ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు చేసే 87 విమానాలను రద్దు చేశారు. ఇంకా ఆ ప్రదేశంలో ఏమైనా పురాతన బాంబులు ఉన్నాయా? అనే కోణంలో విచారణ కూడా సాగుతోందని చైనా వార్తా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

మియాజాకీ ఎయిర్ పోర్టు జపాన్ లో చాలా బిజీ ఎయిర్ పోర్టు. టోక్యో, ఒసాకా, ఫుకుయోకా లాంటి నగరాలకు ఈ ఎయిర్ పోర్ట్ నుంచి రాకపోకలు చేసే విమానాల సంఖ్య ఎక్కువ. ఎయిర్ పోర్టులో డ్యామేజ్ అయిన రన్ వే త్వరగా రిపేర్లకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత మియాజాకీ ఎయిర్ పోర్ట్ ని మిలిటరీ కోసం కాకుండా పౌర విమానాయానం కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ ఎయిర్ పోర్ట్ లో 2500 మీటర్ల రన్ వే ఉండగా ఒక టెర్మినల్ మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. తైవాన్, దక్షిణ కొరియా దేశాలకు ఎక్కువగా అంతర్జాతీయ విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు చేస్తున్నాయి.

79 ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో అమెరికా మియాజాకీ ఎయిర్ పోర్టు పరసరాల్లో వేల సంఖ్యలో బాంబులు కురిపించింది. కేవలం 2023లోనే 2,348 బాంబులను జపాన్ రక్షణ సిబ్బంది డిఫ్యూజ్ చేసింది. ఆ బాంబుల బరువు 37.5 టన్నులు ఉంటుందని సమాచారం.

Related News

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Big Stories

×