E-Paper
Advertisement

Putin Ceasefire : ఉక్రెయిన్‌ ప్రజలను చంపాలనే ఒప్పందానికి ఆలస్యం.. పుతిన్‌పై జెలెన్‌స్కీ ఆరోపణలు

Putin Ceasefire : ఉక్రెయిన్‌ ప్రజలను చంపాలనే ఒప్పందానికి ఆలస్యం.. పుతిన్‌పై జెలెన్‌స్కీ ఆరోపణలు
Advertisement

Putin Ceasefire | ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్‌స్కీ (Zelenskyy) సంచలన ఆరోపణలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నద్ధమవుతున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రజలను చంపాలనే లక్ష్యంగా పుతిన్ పెట్టుకున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

యుద్ధం ఆపేందుకు శాంతి ఒప్పందంలో భాగంగా అమెరికా చేసిన ప్రతిపాదనలకు అంగీకరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడానికి కారణాలు వెతుకుతున్నారని, కాల్పుల విరమణను ఆలస్యం చేయడానికి, అమలు కాకుండా ఉండేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే, కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్ వివిధ షరతులు విధిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా ఈ విషయాన్ని నేరుగా చెప్పడానికి పుతిన్ భయపడుతున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తూ.. ఉక్రెయిన్ (Ukraine) ప్రజలను చంపాలనేదే పుతిన్ లక్ష్యం అని, అందుకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించకుండా సాకులు వెతుకుతున్నారని ఆయన విమర్శించారు.

Advertisement

షరతులు లేని కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రతిపాదన చేసింది. ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను అంగీకరించింది. అయితే కాల్పుల విరమణ సమయంలో, దీర్ఘకాలిక భద్రత మరియు శాశ్వత శాంతి గురించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడం, యుద్ధాన్ని ముగించడానికి ఒక ప్రణాళికను సిద్ధంగా ఉంచామని జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్ వీలైనంత త్వరగా నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని.. ఈ విషయంపై అమెరికా ప్రతినిధులతో కూడా చర్చించామని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌తో యూరోపియన్ భాగస్వాములు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మిత్రదేశాలకు ఈ విషయం తెలుసని కూడా ఆయన పేర్కొన్నారు.

Also Read: ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు ఆదేశాలు చెల్లవు.. ట్రంప్, మస్క్‌లకు కోర్టులో ఎదురుదెబ్బ

Advertisement

ఈ ప్రక్రియను క్లిష్టతరం చేసే పరిస్థితులను తాము సృ‌ష్టించడం లేదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యా కారణంగానే కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమవుతోందని ఆయన ఆరోపించారు. పుతిన్ సంవత్సరాల తరబడి శాంతి లేకుండా యుద్ధం చేస్తున్నారని, ఇప్పుడు ఆయనపై ఒత్తిడి పెంచాల్సిన సమయం ఆసన్నమైందని జెలెన్‌స్కీ అన్నారు. పుతిన్‌పై ఆంక్షలు విధించాలని, ఈ యుద్ధాన్ని ముగించమని రష్యాను బలవంతం చేయడానికి తాము అందరితో కలిసి పని చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.

కాల్పుల విరమణకు పుతిన్ సూత్రప్రాయంగా అంగీకారం
అమెరికా చేసిన 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఇంకా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. “ట్రంప్ ఆలోచన సరైందే. కచ్చితంగా మేం మద్దతిస్తాం” అని మాస్కోలో జరిగిన విలేకరుల సమావేశంలో పుతిన్ ప్రకటించారు. “అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని మా అమెరికా మిత్రులతో మరియు ఇతర భాగస్వాములతో చర్చిస్తాం. ఒప్పందం ఉల్లంఘన కాకుండా, సరైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. యుద్ధం ఆపాలన్న ప్రతిపాదనకు మేం అంగీకరిస్తున్నాం. అయితే కాల్పుల విరమణ, శాశ్వత శాంతి దిశగా సాగుతుందన్న ఆశాభావంతో అందరం ముందుకు వెళ్లాలి. సమస్య మూలాలను తొలగించాలి” అని పుతిన్ చెప్పారు.

ఉక్రెయిన్‌ను అమెరికా ఒప్పించినట్లు కనిపిస్తున్నా.. యుద్ధక్షేత్రంలో పరిస్థితిని అంచనా వేసుకున్న తరువాతే కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ అంగీకరించారని రష్యా అధ్యక్షుడు పేర్కొనడం గమనార్హం. ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుద్ధం ముగియాలని కృషి చేసినందుకు చైనా, భారత్, దక్షిణాఫ్రికా నేతలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మూడు దేశాలు కూడా కీలక పాత్ర పోషించాయన్న సంకేతం ఇచ్చారు.

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×