E-Paper
Advertisement

Kidney Problems : మూత్రం ఈ రంగులో ఉందా.. అయితే మీ కిడ్నీలు..?

Kidney Problems: భారత దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ప్రకారం మన దేశంలో 10 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఈ నివేదిక చెబుతుంది.

Kidney Problems : మూత్రం ఈ రంగులో ఉందా.. అయితే మీ కిడ్నీలు..?

Kidney Problems : భారత దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ప్రకారం మన దేశంలో 10 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఈ నివేదిక చెబుతుంది. 2010 నుంచి 2013 మధ్యలో సంభవించిన మరణాల్లో 15 నుంచి 69 ఏళ్లలోపు వారు కిడ్నీ ఫెయిల్యూర్ వల్లే చనిపోయారు.

  • కిడ్నీలు శరీరంలోని ఫ్లూయిడ్స్‌‌లో ఉన్న వ్యర్థాలను వేరుచేసి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. శరీరానికి హాని కలిగించే జీవ పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి.
  • శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. అవి శరీరంలో కాల్షియం, సోడియం, పొటాషియం, వంటి మినరల్స్ సమతులు స్థాయిలో ఉండేలా చూస్తాయి. ఎర్రరక్త కణాల నిర్మాణంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. రక్తంలోని పీహెచ్ లెవల్స్ సమతుల్యాన్ని కాపాడతాయి. అలానే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతాయి.
  • శరీరంలో రక్తం శుద్ధి జరిగే క్రమంలో లవణాలు, గ్లూకోజ్ నీటిని కిడ్నీల ద్వారా రక్తకణాలు సేకరిస్తాయి. శుద్ధి ప్రక్రియ అనంతరం నరాల ద్వారా రక్తం శరీరం మొత్తం సరఫరా అవుతుంది.
  • శరీరంలోని నీటి నిల్వలను కిడ్నీలు సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్, రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయొచ్చు. డయాబెటిస్ రోగులు కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నారు.
  • ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి శరీరం నుంచి మూత్రం రూపంలో కొద్దిమొత్తంలో ప్రొటీన్ బయటకు పోతుంది. ఈ ప్రొటీన్లు మూత్రం ద్వారా బయటకి వెళ్లిపోతే అది శరీరానికి చాలా ప్రమాదం. ఇలా జరగడానికి డయాబెటిస్ ప్రధాన కారణం. డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోతే ప్రోటీన్ మూత్రం రూపంలో బయటకి వెళ్లిపోతుంది.హైబీపీ, కిడ్నీ వ్యాధులు దీనికి ప్రధాన కారణం.
  • శరీరంలో ఇటువంటి ప్రక్రియ జరిగినప్పుడు “మూత్రం నురగతో వస్తుంది”. కొద్ది రోజుల తర్వాత చేతులు, కాళ్లలో వాపు కనిపిస్తుంది. వీటితో పాటు నీరసం, కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు.
  • మూత్రంలో నీరు, యూరియా, లవణాలు కలిసి ఉంటాయి. శరీరంలో ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లివర్ యూరియాను ఊత్పత్తి చేస్తుంది. శరీరంలోని ఫ్లూయిడ్స్ నుంచి వచ్చే ప్రధాన వ్యర్థ పదార్థం యూరియా. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. శరీరంలోని ఫ్టూయిడ్స్‌ను కిడ్నీలు శుభ్రం చేస్తాయి. ఆ తర్వాత అవి రక్తంలో కలిసిపోతాయి.
  • సాధారణంగా మూత్రం ఎరుపు లేదా ముధురు గోధుమ రంగు, ఏదైనా ముదురు రంగులో వస్తే ఆ వ్యక్తి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. చాలా విషయాలు ఈ రంగులపైనే ఆధారపడి ఉంటాయి.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×