BigTV English

Leftover Food Monsoon: రాత్రి మిగిలిపోయిన ఆహారం తింటున్నారా?.. వర్షాకాలంలో ఇలా చేయడం ప్రమాదకరం

Leftover Food Monsoon: రాత్రి మిగిలిపోయిన ఆహారం తింటున్నారా?.. వర్షాకాలంలో ఇలా చేయడం ప్రమాదకరం

Leftover Food Harmful Monsoon| వేసవికాలంలో భగభగలాడే ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే వర్షాకాలం కోసం ఎదురు చూడాల్సిందే. ఆకుపచ్చని వాతావరణం, చల్లని గాలులను వర్షాకాలం రాకతోనే సాధ్యం. కానీ ఈ సీజన్‌లో తేమ, సూక్ష్మక్రిముల సంఖ్య పెరగడంతో వైరస్, ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం కూడా పొంచిఉంటుంది. మన శరీరంలో ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరులో మార్పులు వస్తాయి. చాలా మంది సౌలభ్యం కోసం రాత్రి మిగిలి పోయిన ఆహారాన్ని ఫ్రిజ్ లో దాచుకొని తింటుంటారు. కానీ, ఈ ఆహారం మీ జీర్ణవ్యవస్థకు సురక్షితమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి.


వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ ఎందుకు సున్నితంగా మారుతుంది?

లైఫ్‌స్టైల్ కోచ్ నిధి నహతా ప్రకారం.. వర్షాకాలంలో తేమ, ఉష్ణోగ్రతల మార్పుల వల్ల జీర్ణశక్తి (అగ్ని) బలహీనపడుతుంది. తగ్గిన శారీరక శ్రమ, ఎంజైమ్‌ల పనితీరు తగ్గడం వల్ల జీర్ణక్రియ మందగించి, కడుపు సున్నితంగా మారుతుంది. దీని వల్ల సాధారణంగా సురక్షితమైన ఆహారం తినడం వల్ల కూడా అలసట, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలను కలిగిస్తుంది.


కానీ రాత్రి మిగిలిపోయిన ఆహారం తాజాదనం కోల్పోతుంది. తేమతో కూడిన వాతావరణంలో ఇందులో సూక్ష్మక్రిములు చేరుతాయి. పోషకాలు తగ్గుతాయి, జీర్ణం కష్టమవుతుంది.

మిగిలిన ఆహారం ఎలా మారుతుంది?

తాజాగా వండిన ఆహారంలో ప్రాణశక్తి (ప్రాణ) ఉంటుంది. ఇది జీర్ణానికి, పోషణకు సహాయపడుతుంది. కానీ, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఈ ప్రాణ శక్తిని కోల్పోతుంది. ఎంజైమ్‌లు విచ్ఛిన్నమవుతాయి, ఆహారం ఆకృతి మారుతుంది, సూక్ష్మక్రిములు పెరుగుతాయి. చూపు, వాసనకు సరిగ్గా ఉన్నా కూడా. వర్షాకాలంలో బియ్యం, పప్పు, కూరలు ఎక్కువసేపు ఉంచితే సూక్ష్మక్రిములు పెరిగి, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడి, కడుపు నొప్పి, అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది.

మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా ఉపయోగించాలి?

మిగిలిన ఆహారాన్ని పారేయడం ఎల్లప్పుడూ సరైనది కాదు. జాగ్రత్తగా ఉపయోగించుకుంటే.. జీర్ణవ్యవస్థను కాపాడుకోవచ్చు:

  • వర్షాకాలంలో 24-36 గంటల్లోపు మిగిలిన ఆహారాన్ని తినేయాలి. ఎక్కువసేపు ఉంచితే నాణ్యత తగ్గుతుంది.
  • ప్లాస్టిక్ కంటే స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా గాజు పాత్రలు వాడండి. ఇవి ఆహార నాణ్యతను కాపాడతాయి, రసాయనాల కలుషితం నివారిస్తాయి.
  • ఆహారాన్ని ఎక్కువసార్లు వేడి చేయడం మానేయండి. ఒకసారి మాత్రమే, తినే మొత్తాన్ని వేడి చేయండి. ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల పోషకాలు నష్టపోతాయి, సూక్ష్మక్రిములు పెరుగుతాయి.
  • తినే ముందు ఆహారాన్ని తాజా పదార్థాలతో రిఫ్రెష్ చేయండి. కొత్తిమీర, నిమ్మరసం, అల్లం, లేదా తేలికగా వేయించిన మసాలాలు జోడించండి. ఇవి రుచిని, జీర్ణశక్తిని పెంచుతాయి.
  • సగం వండిన లేదా కట్ చేసిన పదార్థాలను ఎక్కువసేపు నిల్వ చేయడం కూడా సరికాదు. ఇవి త్వరగా చెడిపోతాయి.
  • ఆహారం విషయంలో మీ ఇంద్రియాలను నమ్మండి. ఆహారం వాసన, రూపం, ఆకృతిలో తేడా అనిపిస్తే, దాన్ని తినకూడదు.

Also Read: నిద్రలేమి సమస్యకు చెక్.. ఇవి తింటే 24 గంటల్లోనే ప్రాబ్లెం సాల్వ్

పాటించాల్సిన జాగ్రత్తలు

పిల్లలు, వృద్ధులు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్నవారు, లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు వర్షాకాలంలో మిగిలిపోయిన ఆహారాన్ని తినేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. సాధారణంగా సరిపోయే ఆహారం వీరికి జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. మిగిలిపోయిన ఆహారం గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహార తయారీ, తినే విధానం ఆరోగ్యాన్ని కాపాడతాయి. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలి.

Related News

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Big Stories

×