E-Paper
Advertisement

Navaratri 2025: నవరాత్రుల సమయంలో మాంసాహారం.. అక్కడి హిందువుల ప్రత్యేక వంటకం

Navaratri 2025: నవరాత్రుల సమయంలో మాంసాహారం.. అక్కడి హిందువుల ప్రత్యేక వంటకం

Navaratri 2025 Non Vegetarian| నవరాత్రుల సమయంలో దుర్గమ్మ తల్లిని అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమయంలో ఉపవాసాలు ఉంటారు. మాంసాహారం అసలు ముట్టుకోరు. భోజనం, పూజా ప్రసాదం అంతా శాఖాహారమే. కానీ దేశంలోని ఒక రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన సంస్కృతి ఉంది. ఆ రాష్ట్రమే పశ్చిమ బెంగాల్‌. అక్కడి ప్రజలు నవరాత్రులు భిన్నంగా జరుపుకుంటారు.

బెంగాలీలు దుర్గా పూజను ఘనంగా జరుపుకుంటూ, చేపలు, మాంసంతో విందులు ఆరగిస్తారు. ఇది కొందరికి ఆశ్చర్యం కలిగించినా, బెంగాలీలు ఈ పద్దతిని గర్వంగా, విశ్వాసంతో, సంప్రదాయంతో కొనసాగిస్తారు.

బెంగాల్‌లో దుర్గా పూజ ఉత్సవ వాతావరణం
బెంగాల్‌లో నవరాత్రి అంటే దుర్గా పూజ, ఇది అక్కడి అతిపెద్ద పండుగ. ఈ సమయంలో ఉపవాసం కాకుండా, కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఆనందంగా విందులు చేస్తారు. విందులో చేపలు, కోషా మాంగ్షో (మాంసం కూర) వంటి వంటకాలు ప్రధాన ఆకర్షణ.

సాంప్రదాయ వంటశాలల్లో రకరకాల చేపల వంటకాలు, మాంసాహార వంటకాలు తయారవుతాయి. సామూహిక పందిళ్లలో అందరూ ఈ విందు భోజనాలు ఆరగిస్తూ ప్రసాదంగా భావిస్తారు. ఈ ఉత్సవం సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకునే సమయం, ఆంక్షలు పెట్టే సమయం కాదని బెంగాలీల భావన.

మాంసం తినడానికి ఆచరణాత్మక కారణాలు
పశ్చిమ బెంగాల్ భౌగోళిక పరిస్థితులు, నదులు ఉండడంతో అక్కడ ప్రజలు చేపలను ముఖ్య ఆహారంగా ఆరగిస్తారు. ఈ చేపలు ప్రొటీన్ పోషకాలు అందిస్తాయి. తొమ్మిది రోజులు ఉపవాసం చేయడం బెంగాల్‌లో సాధారణం కాదు, ఎందుకంటే అక్కడి వాతావరణం ఉపవాసానికి అనుకూలం కాదు. అందుకే చేపలు ఎక్కువగా బెంగాలీలు తింటారు.

చరిత్రకారుడు నృసింహ భదూరి చెప్పినట్లు, చేపలు భూమాత ఆశీస్సుగా భావిస్తారు. శాక్త సంప్రదాయంలో, దేవతలకు మాంసాహార సమర్పణలు చేస్తారు. గుడుల్లో మేక మాంసం ప్రసాదంగా పంచుతారు. దుర్గా లేదా కాళీ దేవికి గుడ్డు, మాంసం సమర్పించడం సంప్రదాయంలో భాగం. ఆహారం ఒక పవిత్ర సమర్పణగా, భక్తిగా భావిస్తారు.

నవరాత్రి సమయంలో ప్రసిద్ధ బెంగాలీ వంటకాలు
బెంగాలీలు కోషా మాంగ్షోను లూచీలతో ఆనందిస్తారు. ఇలిష్ మాచ్ (చేపలు) ఆవిరిలో ఉడికించి లేదా వేయించి సర్వ్ చేస్తారు. చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ కూడా కోల్‌కతాలో ప్రజలను ఆకర్షిస్తాయి. రుయ్ లేదా భెట్కీ చేపలతో కూర, ఫ్రైలు తయారవుతాయి. పందిళ్లలో ఖిచురీ, పాయసం ప్రసాదంగా పంచుతారు. ఫుచ్కా, ఎగ్ రోల్స్ వంటి స్ట్రీట్ ఫుడ్ కూడా ఈ సమయంలో ప్రసిద్ధి.

ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల్లో నవరాత్రులు భిన్నం
ఉత్తర భారతదేశంలో నవరాత్రి సమయంలో కఠిన ఉపవాసం పాటిస్తారు. కుట్టు పూరీలు, సబుదానా ఖిచ్‌డీ వంటి ఆహారాలు సర్వసాధారణం. రెస్టారెంట్‌లలో వ్రత థాలీలు అందుబాటులో ఉంటాయి. కానీ బెంగాల్‌లో పందిళ్లలో బిర్యానీ, చేపల ఫ్రైలు అమ్ముతారు. ఇది ఉత్సవ ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. ఉత్తర, తూర్పు భారతదేశం ఒకే పండుగను భిన్నంగా జరుపుకుంటాయి, ఆహారం ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని చూడవచ్చు.

భారతదేశంలో భిన్న ఆహార పద్ధతులు
ఉత్తర భారతదేశంలో నవరాత్రి పండుగ సమయంలో ధాన్యాలు, మాంసం తినరు. అలాగే గుజరాత్‌లో ఫరాలీ ఢోక్లా, దక్షిణ భారతదేశంలో సుండల్ సర్వసాధారణం. బెంగాల్‌లో మాత్రం మాంసం తింటారు. భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని నవరాత్రి ఆహార పద్ధతులు సూచిస్తాయి.

Also Read: పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ చోరీ.. పర్సులో దాచిన అతిథి

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×