Ayesha Khan: రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘షరారత్’లో తన డ్యాన్స్, గ్లామర్తో అలరించిన నటి ఆయేషా ఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. తాజాగా ఆమె పంచుకున్న కొన్ని కలర్ఫుల్ ఫొటోలు అభిమానులలో భారీగా చర్చకు దారితీశాయి. ఒక మిస్టరీ మాన్తో కలిసి ఉన్న పిక్స్, ఆమె వేలికి ఉన్న మెరిసే వజ్రపు ఉంగరం చూసి ఆయేషా సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకుందా అనే ప్రచారం మొదలైంది. అయితే ఈ రిలేషన్షిప్పై అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం.
ఆయేషా ఖాన్ తెల్లటి రాయల్ డ్రెస్లో దేవకన్యలా మెరిసిపోతూ కొన్ని డ్రీమీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పిక్స్లో ఒక వ్యక్తి భుజంపై తలవాల్చి ఎంతో ఆత్మీయంగా కనిపించారు. అంతేకాకుండా తన చేతికి ఉన్న పెద్ద డైమండ్ రింగ్ను ప్రత్యేకంగా ఎలివేట్ చేస్తూ “ఎ డ్రీమ్” అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆమెకు నిశ్చితార్థం అయిపోయిందని, కాబోయే భర్త ముఖం చూపించకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తోందని ఫ్యాన్స్ అనుకోవడం మొదలుపెట్టారు.
రొమాంటిక్ ఫొటోలు, చేతిలో డైమండ్ రింగ్ చూసి అందరూ ఎంగేజ్మెంట్ అనుకున్నప్పటికీ, ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆయేషా ఖాన్ ఇప్పటివరకు తాను ఎంగేజ్ అయినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఫొటోలు ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషనల్ షూట్లో భాగమని తెలుస్తోంది. ఆమె తన పోస్ట్లో సదరు జ్యువెలరీ బ్రాండ్ను ట్యాగ్ చేయడంతో ఇది కేవలం ఒక యాడ్ ప్రమోషన్ మాత్రమే అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
ఫొటోలో ఉన్న వ్యక్తి ముఖం కనిపించకపోవడంతో ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆయన ఆయేషా నిజమైన పార్ట్నరా లేక ప్రమోషనల్ షూట్ కోసం నటించిన మోడలా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇక గతంలో బిగ్ బాస్ 17 ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆయేషా, ఇప్పుడు తన లేటెస్ట్ పోస్ట్తో ఫ్యాన్స్ను గందరగోళంలో పడేసిందనే చెప్పాలి.
also read: పెళ్లికి సిద్ధమైన ఎక్స్ ప్రెస్ హరి.. వధువు ఎవరంటే?
రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమాలోని ‘షరారత్’ పాటలో క్రిస్టల్ డిసౌజాతో కలిసి ఆయేషా చేసిన మాస్ డ్యాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. షూటింగ్ సమయంలో ఫిజికల్గా చాలా కష్టపడినప్పటికీ, ప్రేక్షకులకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందించినట్లు ఆమె గతంలో చెప్పారు. ఇక ఈ పాటతో ఆమెకు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
మొత్తానికి ఆయేషా ఖాన్ ఎంగేజ్మెంట్ వార్తల్లో నిజం లేదని, అది కేవలం బ్రాండ్ ప్రమోషన్ మాత్రమేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే నిశ్చితార్థం జరిగిందా? లేక ఇది బ్రాండ్ ప్రమోషనా? అన్నది తెలియాలి అంటే ఆమె స్వయంగా స్పందించక తప్పదు. ఏది ఏమైనా, తన గ్లామర్తో పాటు ఈ సస్పెన్స్ ఫొటోలతో సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంలో ఆయేషా పక్కాగా సక్సెస్ అయ్యారు.