E-Paper
Advertisement

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. 8 మంది మృతి

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. 8 మంది మృతి
Advertisement

3-storey building collapses in Lucknow.. 5 killed; several injured: దేశమంతటా వినాయక చవితి వేడుకల వేళ ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యూపీ రాజధాని లక్నో పరిధిలోని ట్రాన్స్ పోర్ట్ నగర్ లో నిర్మాణ దశలో ఉన్న మూడంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదంలో వందలాది మంది భవన శిథిలాల మధ్య ఇరుక్కుపోయారు. 30 మందికి పైగా బయటపడ్డారు. వారిని సురక్షితంగా బయటకు తెచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భవనానికి సంబంధించిన మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఉన్నట్లుండి పిల్లర్లు విరిగిపోయాయి. దీనితో భవనం పెద్ద శబ్ధం చేస్తూ కూలిపోయింది.

సకాలంలో స్పందన

Advertisement

సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెస్క్కూ బృందాలు అక్కడికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. ఈ ఘటనపై సీఎం ఆదిత్యానాధ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని..వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. ప్రమాదానికి జరిగిన కారణాలు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని..ఎంతటి వారినైనా వదిలేది లేదని..ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని.పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛ నిచ్చామని అన్నారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ దుర్ణటన జరిగినట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×