E-Paper
Advertisement

Amarnath yatra : వాతావరణం సానుకూలం.. అమర్‌నాథ్‌ యాత్ర మళ్లీ ప్రారంభం..

Amarnath yatra : వాతావరణం సానుకూలం.. అమర్‌నాథ్‌ యాత్ర మళ్లీ ప్రారంభం..

Amarnath yatra : ప్రతికూల వాతావరణం కారణంగా 3 రోజులపాటు నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. జమ్మూ-కశ్మీర్‌లోని పంజ్‌తర్ణి, శేష్‌నాగ్‌ క్యాంపుల నుంచి యాత్రికులు మళ్లీ బయల్దేరారు. వర్షాల వల్ల పంజ్‌తర్ణిలో 1500 మంది సందర్శకులు చిక్కుకుపోయారు. వారిలో 200 మంది తెలుగువారు ఉన్నారు. ఆదివారం అమర్‌నాథ్‌ ఆలయం వద్ద వాతావరణం సానుకూలంగా మారింది. దీంతో అధికారులు వెంటనే గేట్లను తెరిచారు. హిమలింగానికి భక్తులు పూజలు చేసేందుకు అనుమతించారు.

ఇప్పటికే దర్శనం చేసుకొన్న భక్తులను బల్తాల్‌ బేస్‌ క్యాంపునకు చేరుకొనేందుకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అనంతనాగ్‌లో సైన్యం క్వాజిగుండ బేస్‌క్యాంప్‌లో 700 మంది సందర్శకులకు ఆశ్రయం కల్పించింది.

మరోవైపు భారీ వర్షాల వల్ల జమ్మూ-శ్రీనగర్‌ నేషనల్ హైవేను మూసివేశారు. ఈ పరిస్థితుల్లో జమ్మూ నుంచి యాత్రికులను అనుమతించడంలేదు. ఈ జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. రామ్‌బన్‌ జిల్లాలో 40 అడుగుల వరకు రహదారి దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో 3,500 వాహనాలు చిక్కుకుపోయాయి.

గురువారం రాత్రి నుంచి జమ్మూ-కశ్మీర్‌లో భారీ వానలు పడుతున్నాయి. అమర్‌నాథ్‌ క్షేత్రం వద్ద భారీగా మంచు కురుస్తోంది. దాదాపు 50 వేల మంది యాత్రికులు బేస్‌ క్యాంపుల్లోనే ఉండిపోయారు. సోమవారం నుంచి వాతావరణం మరింత సానుకూలంగా మారుతుందని వాతావరణశాఖ ప్రకటించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×