BigTV English

Anant Ambani Completes Padayatra: ముగిసిన అనంత్ అంబానీ పాదయాత్ర.. శ్రీ కృష్ణుడి దర్శనం కోసం 170 కిమీ కాలినడక

Anant Ambani Completes Padayatra: ముగిసిన అనంత్ అంబానీ పాదయాత్ర.. శ్రీ కృష్ణుడి దర్శనం కోసం 170 కిమీ కాలినడక

Anant Ambani Completes Padayatra| రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ 170 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. గుజరాత్‌లోని తమ పూర్వీకుల స్వస్థలం జామ్‌నగర్ నుంచి శ్రీకృష్ణుడి దివ్య క్షేత్రం ద్వారకకు పాదయాత్రను ప్రారంభించిన విషయం ఇటీవల మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగిస్తూ అనంత్ ఆదివారం శ్రీ రామనవమి రోజున ద్వారక నగరానికి చేరుకొని శ్రీ కృష్ణుడిని దర్శించుకున్నారు.


ఈ సందర్బంగా.. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన తల్లి నీతా అంబానీ, భార్య రాధికా మర్చంట్‌తో కలిసి పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర యాత్రలో తనతో ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపి, ఆధ్యాత్మిక అనుభూతిని పంచుకున్నారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ పుట్టినరోజు కాగా.. అప్పటి వరకు ఆయన ద్వారక లోనే బస చేస్తారు.

నీతా అంబానీ స్పందిస్తూ..
ఈ సందర్భంంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. తన కుమారుడు పది రోజులపాటు పాదయాత్ర చేసి ద్వారకకు చేరుకోవడం పట్ల చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఈ ప్రయాణంలో పాల్గొన్న యువకులందరూ భారతదేశ సంస్కృతిని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. అనంత్‌కు ఆ శ్రీ కృష్ణుడు మరింత శక్తినివ్వాలని తన హృదయపూర్వకంగా ప్రార్థించానని నీతా అంబానీ పేర్కొన్నారు.


Also Read: జమిలి ఎన్నికలు అప్పుడే.. సమయం చెప్పేసిన నిర్మలా సీతారామన్

పాదయాత్ర వివరాలు
అనంత్ అంబానీ మార్చి 29న ద్వారకకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో ప్రతి రోజు 20 కిలోమీటర్ల దూరాన్ని నడిచారు. ప్రతిరోజు రాత్రి వేళ మాత్రమే సుమారు ఏడు గంటలపాటు నడుస్తూ.. మార్గంలో ఎదురైన ప్రజలతో మమేకమై, ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.

ఈ ప్రయాణంలో కొంతమంది స్థానికులు కూడా అనంత్‌కు సంఘీభావంగా పాదయాత్రలో చేరి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో సహకరించారు. పాదయాత్ర చివర్లో అనంత్ హనుమాన్ చాలీసా, సుందరకాండ, దేవీ స్తోత్రాలను పాడుతూ ఆధ్యాత్మికంగా తన యాత్రను ముగించారు. ఈ పాదయాత్ర అనంత్‌కు ఒక సాధారణ ప్రయాణం కాకుండా, జీవితంలో ఆధ్యాత్మిక శక్తిని పొందే ఒక అర్థవంతమైన అనుభూతిగా నిలిచిందని ఆయన భార్య రాధికా మర్చెంట్ అన్నారు.

యువతకు అనంత్ అంబానీ సందేశం
తాను ద్వారకకు పాదయాత్ర చేస్తున్న సమయంలో అనంత్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ, తన జీవితంలో ప్రతి పనిని ప్రారంభించే ముందు ద్వారకాధీశుడిని స్మరించడం తన అభ్యాసమని తెలిపారు. “ద్వారకాధీశుడిని స్మరించినప్పుడు ఏ పనైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫల్యంగా పూర్తవుతుంది” అని ఆయన చెప్పారు.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×