BigTV English

Pahalgam attack: పహల్గామ్ టెర్రర్ అటాక్.. భారీ శబ్దాలు, మరో అతి భయంకరమైన వీడియో..

Pahalgam attack: పహల్గామ్ టెర్రర్ అటాక్.. భారీ శబ్దాలు, మరో అతి భయంకరమైన వీడియో..
Pahalgam attack: కశ్మీర్, అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల హింసాత్మక దాడితో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన వార్త విన్న దేశ ప్రజలు షాక్ కు గురయ్యారు. అమాయక టూరిస్టులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 27 మంది మృతి చెందడం దేశ ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే రక్షణ దళాలు, కశ్మీర్ పోలీసులు,  పారా మిలిటరీ దళాలు రంగంలోకి దిగి  ఉగ్రవాదుల కదలికలపై పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దేశ ప్రజలు ఉగ్రవాదులపై ఫైరవుతున్నారు. వారిని ఎక్కడున్నా దొరకపట్టి ఊహకు అందని విధంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిదే.


అయితే, కశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అందులో ఓ టూరిస్ట్ జిప్‌ లైన్‌ పై వెళ్తుండుగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన స్పాట్‌‌ ఏరియా మొత్తం ఆ వీడియోలో కవర్ అయ్యింది. ఉగ్రవాదుల కాల్పులకు పర్యాటకులు భయంతో పరుగులు తీసినట్టు వీడియోలో కనిపించింది. పర్యాటకలను ఉగ్రవాదులు కాలుస్తున్న సౌండ్లు భారీగా వీడియోలో వినిపిస్తున్నాయి.

కశ్మీర్ అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నప్పుడు అక్కడున్న టూరిస్టులు భయాందోళనకు గురై ఒక్క సారిగా పరుగులు తీశారు. ఓ టూరిస్ట్ జిప్‌లైన్‌లో వెళ్తూ సెల్ఫీ వీడియోలో ఇదంతా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఆ వీడియోలు తుపాకుల శబ్ధం, టూరిస్టులు పరిగెడుతున్న విజువల్స్ నీటిగా కనిపిస్తున్నాయి.


అదే ఏరియాలో తీవ్రవాదులు 28 మంది పర్యటకులను టెర్రరిస్టులను దారుణంగా కాల్చి చంపారు. ఉగ్రవాదుల భయానికి ఓ యువకుడు పరిగెడుతూ కింద పడిపోవడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో తీసిన వ్యక్తి పేరు రిషి భట్. దాదాపు 16, 18 మందిని హత్య చేయడం జిప్‌లైన్‌ పై నుంచి వెళ్తూ ఆయన చూశానని ఆయన చెప్పారు. జిప్ లైన్ ఆపరేటర్ అల్లా హు అక్బర్ అని గట్టిగా అరిచి.. ఆ తర్వాత వెంటనే కాల్పులు జరపడం స్టార్ట్ చేశాడని అన్నారు.

అతని జిప్‌లైన్ స్టార్ట్ అయ్యాక… 15 సెకన్ల తర్వాత కాల్పులు జరిగాయని చెప్పాడు. అప్పటికే అతని భార్య, పిల్లాడు కింద నుంచి కేకలు వేస్తున్నారని రిషి భట్ వివరించాడు. ఈ విశాలమైన ప్రదేశంలో ఉన్న పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిగాయని ఆ భయంకరమై దృశ్యాలు ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చాడు.

Also Read: Pakistan Airlines: భారత్‌పై ఆంక్షలు విధించి.. బొక్కబోర్లా పడుతున్న పాకిస్థాన్..

 

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×