E-Paper
Advertisement

Bharat Bandh: రేపు భారత్ బంద్.. స్కూళ్లు, బ్యాంకులకు సెలవు ఉంటుందా?

Bharat Bandh: రేపు భారత్ బంద్.. స్కూళ్లు, బ్యాంకులకు సెలవు ఉంటుందా?
Advertisement

Bharat Bandh: రేపు బ్యాంకులు, బీమా, పోస్టల్ తదితర రంగాలు బంద్ కానున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, అలాగే ప్రభుత్వ ప్రాజెక్టులపై అసంతృప్తితో పదికి పైగా కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఐక్యవేదిక రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. పలు ప్రభుత్వ రంగాలపై దీని ప్రభావం పడనుంది. బ్యాంకింగ్, పోస్టల్, విద్యుత్, బీమా లాంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన రాలేదు. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రవాణా అంతరాయం, నిరసనల కారణంగా కొన్ని స్కూళ్లు, కాలేజీల కార్యకలాపాలకు ఆటంకం కలిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

రేపు పదికి పైగా కేంద్ర ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, గ్రామీణ కార్మిక సంస్థలు కలిసి భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దాదాపు 25 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. అందుకే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోస్టాఫీసులపై ఎఫెక్ట్ ఉండనుంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రేపు అధికారికంగా హాలిడే గా ప్రకటించకపోతే, బ్యాంకులు సాధారణ రోజుల్లాగే పని చేయవచ్చు. కానీ సమ్మె వల్ల సిబ్బంది తక్కువగా ఉండొచ్చు. కాబట్టి బ్యాంక్‌లో క్యూలు, రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అత్యవసరమైన పని లేకపోతే, ఆ రోజు బ్యాంకుకు వెళ్లకుండా మరో రోజు ప్లాన్ చేసుకోవడం బెటర్.

Advertisement

ALSO READ: Indian Navy: ఇంటర్ పాసైన వారికి అద్భుత అవకాశం.. ఈ కోర్సులో చేరి రూ.56,100 జీతం పొందండి.. సింపుల్ ప్రాసెస్

ఇక, డిజిటల్ సర్వీసుల గురించి చెప్పాలంటే, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM సర్వీసులు ఆ రోజు కూడా సాధారణంగా పని చేస్తాయి. కాబట్టి ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, బిల్లులు చెల్లించడం వంటివి సులభంగా చేయొచ్చు. కానీ చెక్ డిపాజిట్ చేయడం, క్యాష్ విత్‌డ్రా చేయడం, KYC అప్‌డేట్ వంటి బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లాల్సిన పనులైతే ముందు రోజు లేదా తర్వాత రోజు చూసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ALSO READ: BHEL Jobs: పది, ఐటీఐతో 515 ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్.. జాబ్ వస్తే రూ.65వేల జీతం భయ్యా

సమ్మె కారణంగా బ్యాంకులే కాదు, కొన్ని ఇతర సంస్థల్లోనూ అంతరాయం కలిగే అవకాశం ఉంది. అయితే, స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, బస్సులు, రైళ్లు, ఎయిర్‌పోర్ట్‌లు, మార్కెట్లు వంటివి సాధారణంగా పని చేయనున్నాయి. కాబట్టి, రేపు బ్యాంక్ పని ఉంటే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×