BigTV English
Advertisement

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలులో అర్వింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసందే. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం కేజ్రీవాల్‌ను  హాజరు పరచడగా కోర్టు మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది.


ఇవాల్టితో మూడు రోజుల సీబీఐ రిమాండ్ ముగియటంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం మరో రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ పొడగించాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూలై 12 వరకు కేజ్రీవాల్ రిమాండ్ కొనసాగనుంది.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకారం తెలిపింది,


విచారణ సమయంలో కేజ్రీవాల్ సరిగా సహకరించలేదని సీబీఐ రిమాండ్ దరఖాస్తులో కోర్టుకు వెల్లడించింది. నేరం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలకు విరుద్ధంగా కేజ్రీవాల్ సమాధానాలు ఇచ్చారని అంతేకాకుండా కొన్నింటికి అసలు సమాధానం చెప్పలేదని తెలిపింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ ను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.

Also Read: నీట్‌ పీజీ నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు

సీబీఐ అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ ను జూలై 12 వరకు జుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆయనను జూలై 12 రోజున కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థించిన కొన్ని గంటలకే ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో కోర్టు అనుమతితో సీబీఐ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది.

 

Tags

Related News

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Big Stories

×